Mathura Tragedy: అయ్యో ఘోర ప్రమాదం.. భవనం కూలి ముగ్గురు స్పాట్ డెడ్ - మరో 15 మంది..! (వీడియో)

యూపీలోని మధురలో ఘోర ప్రమాదం సంభవించింది. ఆదివారం సడక్ ప్రాంతంలోని గోవింద్ నగర్‌లో ఒక గుట్టపై నిర్మించిన అనేక అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో తోటారామ్ (38), యశోద (6), కావ్య (3) మరణించారు. అనేక మందిని శిథిలాల కింద నుంచి తీస్తున్నారు.

New Update
mathura tragedy building collapse

mathura tragedy building collapse

ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఘోర ప్రమాదం సంభవించింది. ఆదివారం సడక్ ప్రాంతంలోని గోవింద్ నగర్‌లో ఒక గుట్టపై నిర్మించిన అనేక అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మైనర్ సోదరీమణులు సహా మరొకరు మరణించారు. అంతేకాకుండా ఈ ప్రమాదంలో 12 నుంచి 15 మంది కార్మికులు శిథిలాలు, మట్టి కింద చిక్కుకున్నారు. పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మట్టి పిరమిడ్ కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. మృతులలో తోటారామ్ (38), ఇద్దరు సోదరీమణులు - యశోద (6), కావ్య (3) ఉన్నారు.  

Also Read: దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం

ప్రస్తుతం సహాయక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అగ్నిమాపక సేవలు, మున్సిపల్ కార్పొరేషన్, పౌర రక్షణ, పోలీసుల బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. సమీపంలోని ఐదు నుండి ఆరు ఇళ్ళు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 

Also Read: ఇది సార్ మా అన్న బ్రాండ్.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. వీడియోలు వైరల్!

ఏం జరిగిందంటే? 

వర్షాకాలంలో ఆ ప్రాంతంలోని గుట్టలపై ఉన్న మట్టి కూలిపోతుండటంతో ఇళ్ళు కూడా నేలమట్టం అవుతున్నాయి. దీనిని నివారించేందుకు గుట్టపై ఇళ్ళు నిర్మించిన నివాసితులు ఆ ప్రాంతం చుట్టూ సరిహద్దు గోడలను కట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే గోడ నిర్మాణ పనులు దాదాపు వారం రోజులుగా కొనసాగుతున్నాయి. 

Also Read: భార్యపై ఇంత ప్రేమ.. ఏకంగా మరో ‘తాజ్ మహల్’ను కట్టించిన భర్త - వీడియో చూశారా?

ఇలా ఆదివారం మధ్యాహ్నం 12:15 గంటల ప్రాంతంలో గుట్టపై ఉన్న మట్టి అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంతో 6 ఇళ్లు కూలిపోయాయి. దీంతో ఆ స్థలంలో పనిచేస్తున్న కార్మికులు, నివాసితులు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక శాఖ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

Mathura Tragedy

Advertisment
Advertisment
తాజా కథనాలు