Bird Flu: రాష్ట్రంలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం..17 వేల కోళ్లు పూడ్చివేత
తెలంగాణలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. ఏపీని వణికించిన బర్డ్ ప్లూ ఇప్పుడు తెలంగాణలోనూ తన ప్రభావాన్నిచూపుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పరిధి బాటసింగారం పౌల్ట్రీ ఫామ్లో కోళ్లకు బర్డ్ఫ్లూ సోకినట్లుగా అధికారులు గుర్తించారు.