/rtv/media/media_files/2025/06/04/4helohbCvZ5YLvHTPSgN.jpg)
China Biological War
China Biological War: డ్రాగన్ కంట్రీ కడుపు నిండా కుట్రలే. ఆ దేశంలో బయో టెక్నాలజీ(Bio Technology)పై చేస్తున్న పరిశోధనలు వేల మంది ప్రాణాలను బలిగొన్నాయి. చైనా గురించి చెప్పాలంటే ఒక్క కరోనా పేరు చెప్తే చాలు. ప్రపంచ శక్తిగా ఎదగాలనుకునే చైనా కోరిక నెరవేర్చుకునేందుకు ప్రపంచదేశాలను ప్రమాదంలో పడేస్తోంది. భూమండలంలో ఎక్కడ లేని వ్యాధులను సృష్టించాలి.. తిరిగి వాటికి మెడిసిన్ కనిపెట్టాలనే లక్ష్యంగానే చైనాలో వేల సైంటిస్టులు పని చేస్తున్నారు. చైనా చేసిన బయోవార్(Bio War) ప్రయోగాలు నిజమని ఆధారాలు లేవు కానీ.. ఆరోపణలు మాత్రం కోకొళ్లలు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఆ ఆరోపణలకు బలం చేర్చుతున్నాయి.
Also Read: ఫలించిన 18 ఏళ్ళ నిరీక్షణ..మిన్నంటిన ఆర్సీబీ సంబరాలు
అమెరికా(America)లో చైనా ఫంగస్(China Fungus) కలకలం
చైనా ల్యాబ్ నుంచి 2025 జూన్లో మరో డేంజరస్ ఫంగస్ బయటకొచ్చింది. పుసారియమ్ గ్రామినేరియమ్ అనే ఫంగస్ని డ్రాగన్ కంట్రీ అభివృద్ధి చేసింది. ఈ ప్రమాదకరమైన ఫంగస్ అమెరికాకు అక్రమంగా రవాణ చేస్తుండగా ఇద్దరు చైనా శాస్త్రవేత్తలు అరెస్ట్ అయ్యారు. మిషిగన్ యూనివర్సిటీలో పరిశోధనల కోసం ఫంగస్ తరలిస్తుండగా ఎయిర్పోర్ట్లో FBI అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. చైనా, అమెరికాల మధ్య ముదురుతున్న విభేదాల కారనంగా అమెరికాను దెబ్బ తీసే కుట్ర అని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇది బయోలాజికల్ వార్ అని అమెరికా ఆరోపిస్తోంది. ఈ ఫంగస్ కారణంగా మానవులకు, పశువులకు హాని కలుగుతుంది. వాంతులు, కాలేయాన్ని దెబ్బ తీస్తోందని అమెరికా వైద్య అధికారులు చెబుతున్నారు. ఈ శీలింధ్రాలు గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి పంటలను నాశనం చేస్తోంది.
చైనా నుంచే కరోనా(Carona)
2021 మేలో చైనా కరోనా వైరస్ను ఆయుధంగా తయారు చేయాలని రీసెర్చ్ చేసిందని నివేదికలు వచ్చాయి. దీనిపై ఇప్పటికీత ఆధారాలు లేవు. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి కరోనా బయటకొచ్చిందన్న వాదలను చైనా తోసిపుచ్చింది. ఈ మహమ్మారి మరణాల రేటు SARS, స్వైన్ ఫ్లూ కంటే చాలా తక్కువగా ఉన్నప్పటికీ, వేగంగా వ్యాపించడంతో పాటు తీవ్రమైన నష్టాలను కలుగజేసే స్వభావంతో ఇది ఎక్కువ ప్రమాదకారిగా మారింది.
హాంకాంగ్లో సార్స్ మారణహోమం
SARS మహమ్మారి 2002 నవంబర్లో చైనాలో మొదటిసారి వ్యాపించింది. ఈ వైరస్ దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రాంతంలో బయటపడింది. 2002 నవంబర్ నుంచి 2003 జులై మధ్య దక్షిణ చైనాలో సార్స్ వ్యాధి వ్యాప్తి చెందింది. అనేక దేశాలలో వేలాది మంది ప్రజలు ఈ అంటువ్యాధి బారిన పడ్డారు. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. సార్స్ కారణంగా హాంకాంగ్లో ఎక్కువ మరణాలు నమోదయ్యాయి. ఈ వ్యాధి ప్రపంచంలోని 37 దేశాలకు వ్యాపించింది. ఈ అంటువ్యాధిలో మరణాల రేటు 9.6 శాతంగా నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కొత్త కరోనా వైరస్ కూడా SARS కుటుంబానికి చెందినదే కావడం గమనార్హం. ఇప్పటి వరకూ SARS వైరస్కు టీకా, మెడిసిన్ సిద్ధం కాలేదు.
Also Read: ఈ సాలా కప్ నమ్దే..18 ఏళ్ళ కల... బెంగళూరు రాయల్ విన్నింగ్
బర్డ్ ఫ్లూ(Bird Flu)
ఏవియన్ ఫ్లూ లేదా బర్డ్ ఫ్లూ అనేది కూడా ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది పక్షుల నుంచి పక్షులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ మనుషులకు కూడా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన కోళ్లు లేదా ఇతర పక్షులకు దగ్గరగా ఉండే వారికి, వారి నుంచి ఇతరులకు ఈ వ్యాధి సోకుతుంది. మానవుల్లో నోరు, కళ్లు, ముక్కు ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఈ అంటువ్యాధిలో అనేక రూపాలు ఉన్నాయి. అయితే ప్రబలంగా ఉన్న H5N1 వైరస్ మాత్రం 1996లో చైనాలో మొదటిసారి కనిపించింది. ఇది అధిక తీవ్రత ఉండే వ్యాధికారక వైరస్. 2000 సంవత్సరం తరువాత అనేక దేశాల్లో ఏవియన్ ఫ్లూ వ్యాప్తి చెందింది. దీంతో చైనా అంటువ్యాధులను వ్యాప్తి చేస్తోందని అప్పటి నుంచే అమెరికా ఆరోపించడం ప్రారంభించింది.
Also Read: బెంగళూరు కోసమే నేనున్నా...విరాట్
స్వైన్ ఫ్లూ
స్వైన్ ఫ్లూ ఒక అంటు వ్యాధి. తేలికగా తీసుకుంటే ఇది తీవ్రమైన పరిణామాలకు కారణమవుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అనేక స్వైన్ఫ్లూ కేసులు వెలుగు చూశాయి. స్వైన్ ఫ్లూ ఇన్ఫెక్షన్కు చికిత్స చేయకపోతే, అది కూడా ప్రాణాంతకమవుతుంది. ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారికి ఇది చాలా ప్రమాదకరం. చిన్న పిల్లలు, వృద్ధులకు కూడా ఇది ప్రమాదకరంగా మారుతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నవారు కూడా ఈ వ్యాధికి బలైపోతారు. దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స తీసుకుంటున్న వారికి స్వైన్ ఫ్లూ వల్ల ఎక్కువ ముప్పు ఉంటుంది. 2007లో ఈ అంటువ్యాధి ఫిలిప్పీన్స్పై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది.
Also Read: కెప్టెన్ మారాడు కథ మారింది..
పాకిస్తాన్తో సీక్రెట బయోవార్ ఫేర్
2020లో చైనాలోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఆంత్రాక్స్ లాంటి వ్యాధికారకాలకు సంబంధించిన ప్రాజెక్టులపై పరిశోధనలు చేయడానికి పాకిస్తాన్తో మూడేళ్లు రహస్య ఒప్పందం కుదుర్చుకుందని వార్తలు వచ్చాయి. ప్రమాదకరమైన సూక్ష్మజీవులను నిర్వహించడంలో పాకిస్తాన్ సామర్థ్యం పెంచడం కోసం పని చేసిందని ఆరోపణలు ఉన్నాయి. అయితే, పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఈ ఆరోపణలు ఫేక్ అని, రాజకీయ కుట్ర ప్రేరేపితమైనవని ఖండించింది.
చైనా బయలాజికల్ వార్ ప్రొగ్రామ్
కోల్ట్ వార్ సమయంలో చైనా ఆంత్రాక్స్, బోటులినమ్ టాక్సిన్లు, ప్లేగు వంటి ఏజెంట్లను ఆయుధంగా మార్చే బయలాజికల్ వార్ వెపన్ను తయారు చేసే ప్రొగ్రామ్ అభివృద్ధి చేసిందని తెలుస్తోంది. 1984లో బయోలాజికల్ ఆయుధాల ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత కూడా కొన్ని చైనా సంస్థలు బయోలాజికల్ ఆయుధాలను తయారు చేస్తున్నాయని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది.1980లో రెండు అంటువ్యాధులు హెమరేజిక్, ఫీవర్ చైనా బయలాజికల్ వెపన్స్ సెంటర్ నుంచి వచ్చాయని సోవియట్ నిఘా వర్గాలు అనుమానించాయి. 1980లలో చైనా బయోలాజికల్ ఆయుధాల ప్రోగ్రామ్ నిర్వహించిందని నివేదికలు ఉన్నాయి.
సముద్ర జీవులపై డ్రాగన్ రీసెర్చ్
2024 ఏప్రిల్లో చైనా సైనికులు సముద్ర విషజన్యులపై పరిశోధన చేస్తున్నారని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ విషజన్యులు మానవులకు, పశువులకు ప్రమాదకరమైనవి కావచ్చు. అయితే, ఈ రీసెర్చ్ ఉద్దేశం బయోలాజికల్ ఆయుధాలు తయారు చేయడమని నిరూపించబడలేదు.