/rtv/media/media_files/2025/10/29/montha-tooffan-2025-10-29-06-23-49.jpg)
Montha Tooffan
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మొంథా అర్థరాత్రి సమయంలో తీరం దాటినట్లు ఐఎండీ తెలిపింది. మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడకు సమీపంలోని నరసాపురానికి దగ్గరలో మంగళవారం రాత్రి 11:30 నుంచి 12:30 మధ్య మొంథా తుపాను తీరం దాటినట్లు వెల్లడించారు. అయితే మొంథా తుపాను తీరం దాటినప్పటికి తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుపాను తెలంగాణ మీదుగా ఛత్తీస్గఢ్ దగ్గర బలహీన పడే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో ఏపీతో పాటు తెలంగాణ, ఛత్తీస్గఢ్లో గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: దిశ మార్చుకున్న మొంథా తుపాను.. తీరం దాటడంలో ట్విస్ట్
#CycloneMontha | The Severe Cyclonic Storm moved WNW at 12 kmph; now centered near 16.35°N, 81.65°E — 50 km from Machilipatnam, 90 km from Kakinada & 470 km from Odisha’s Gopalpur. #IMD#WeatherAlert#CycloneUpdate#Odishapic.twitter.com/e9jmBKIBrn
— Argus News (@ArgusNews_in) October 28, 2025
ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..
మొంథా తుపాను ప్రభావం ఏపీకి అధికంగా ఉండటంతో అధికారులు కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, కాకినాడ, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, అల్లూరి, ఏలూరు, మన్యంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని వెల్లడించారు.
ఇది కూడా చూడండి: Montha Cyclone: మొంథా తుఫానుపై ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ..ఆర్ & బీ శాఖకు ప్రత్యేక ఆదేశాలు
ఈ మొంథా తుపాను ప్రభావం వల్ల తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా నల్గొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట్, ఖమ్మం, వనపర్తి, మహబూబ్నగర్, రంగారెడ్డిలో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు.
#retweet@balaji25_t
— Jagdish Dubey (@Jagdish_Dubey) October 29, 2025
DELUGE RAINS IN SOUTH TG ⚠️🌧️
CYCLONE MONTHA CORE BANDS are just stuck and NON STOP HEAVY RAINS keep on pouring all over Nagarkurnool, Nalgonda, Suryapet, Khammam, Wanaparthy, Mahabubnagar, Rangareddy for NEXT SEVERAL HOURS ⚠️
200mm event for Nagarkurnool ⚠️ https://t.co/BQvo6a7Azbpic.twitter.com/43nc9LE9TV
Follow Us