Andhra Pradesh: 10వ తరగతి విద్యార్థులకు అలెర్ట్.. పరీక్ష వాయిదా
ఏపీలో మార్చి 31న జరగాల్సిన పదవ తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష రంజాన్ కారణంగా వాయిదా పడింది. ఈ పరీక్షను ఏప్రిల్ 1న(మంగళవారం) నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది.
ఏపీలో మార్చి 31న జరగాల్సిన పదవ తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష రంజాన్ కారణంగా వాయిదా పడింది. ఈ పరీక్షను ఏప్రిల్ 1న(మంగళవారం) నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది.
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. అయితే పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే గందరగోళం నెలకొంది. పరీక్షల్లో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఒక ప్రశ్నా పత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రం ఇవ్వడంతో పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది.
తెలంగాణలో ఈ రోజు నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతాయి.
తెలంగాణలో ప్రీ ఫైనల్ పరీక్షలు మార్చి 6 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే పరీక్ష సమయాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. పరీక్ష సమయాన్ని గంట ముందుకు ఎందుకు జరిపారంటూ రాష్ట్ర విద్యాశాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు కేవలం మూడు రోజులు మాత్రమే సంక్రాంతి సెలవులను ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. జనవరి 13, 14, 15 తేదీల్లో సెలవులు ఇచ్చి, మిగతా రోజులు అదనపు తరగతులు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పదో తరగతి పరీక్షలు సెమిస్టర్ విధానంలో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ఈ ఎగ్జామ్స్ మార్చి, ఏప్రిల్ నెలల్లో ఒకేసారి నిర్వహిస్తున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికి ఏడాదికి రెండు సార్లు ఎగ్జామ్స్ పెట్టాలనుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నుంచి హాల్టికెట్లు విడుదల కానున్నాయి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ www.bse.ap.gov.in నుంచి విద్యార్ధులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా.. మార్చి 18 నుంచి 30 వరకూ పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి.
పదోతరగతి పబ్లిక్ పరీక్షల గురించి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది కంపోజిట్ తెలుగు, కాంపోజిట్ సంస్క్రుతం పేపర్లను కొనసాగించాలని నిర్ణయించింది. మొదట్లో ఈ పేపర్లను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అయితే విద్యా సంవత్సరం మధ్యలో మార్పులు చేయడంపై విమర్శలు తలెత్తడంతో సర్కార్ వెనకడుగు వేసింది. వచ్చే ఏడాది నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకుంది.