nellore
AP: నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ గా ఐఏఎస్ సూర్యతేజ బాధ్యతలు
Nellore: నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు ఐఏఎస్ అధికారి మల్లవరపు సూర్యతేజ. ఇటీవల కమిషనర్ వికాస్ మర్మత్ బదిలీ కావడంతో సూర్యతేజను ఇక్కడ కమిషనర్ గా ప్రభుత్వం నియమించింది. ఇవాళ కుటుంబ సమేతంగా కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చిన నూతన కమిషనర్ ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టారు.
నెల్లూరు నగరపాలక సంస్థను ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుతానని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని సూర్యతేజ అన్నారు. ప్రత్యేకించి కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేలా కృషి చేయడంతో పాటు.. అన్ని విభాగాలపై దృష్టి పెడుతానని, కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని సూర్యతేజ వెల్లడించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు.
AP: నా ఆశ్రమాన్ని నాకు ఇప్పించండి.. గోపాలకృష్ణ స్వామి మౌన నిరాహార దక్ష..!
Nellore: తన ఆశ్రమాన్ని తనకు ఇప్పించాలంటూ ముమ్మడి గోపాలకృష్ణ స్వామి నెల్లూరు జిల్లాలో స్థానిక శివాలయం సెంటర్ లో ఆమరణ మౌన నిరాహార దక్ష చేపట్టారు. హిమాలయ పర్వతాలను అధిరోహించేందుకు వెళ్లే క్రమంలో ఆశ్రమాన్ని స్వామి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 10 సంవత్సరాలుగా తన బంధువైన గోదల మహేంద్రకు ఆశ్రమ బాధ్యతలు ఇచ్చారు.
అయితే, పుణ్యక్షేత్రాలను దర్శించుకుని తిరిగి ఆశ్రమానికి చేరుకున్న గోపాలకృష్ణ స్వామి.. ఆశ్రమానికి వచ్చేటువంటి మూలధనాన్ని గోదల మహేంద్ర సొంత ఖర్చులకు వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మార్గంలో ఉన్నటువంటి విలువైన ఆస్తి కోసమే ఆశ్రమాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు భక్తులు సైతం వాపోతున్నారు.
Also Read: ఏపీలో మరో ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య..!
AP: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం..!
Nellore: నెల్లూరు జిల్లా బోగోలు (మం) బిట్రగుంట రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కృష్ణపట్నం పోర్ట్ నుండి గోండియా, వాడ్స వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బిట్రగుంట స్టేషన్ లో పట్టాలు క్రాస్ చేస్తుండగా రైలు బోగీలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే శాఖ హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టింది.
Also Read: నీట్ మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదు: సుప్రీంకోర్టు
AP: అధ్వానంగా ఆత్మకూరు వీవర్స్ కాలనీ.. 40 ఏళ్ళు గడుస్తోన్నా..
Nellore: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వీవర్స్ కాలనీ వాసుల పరిస్థితి అధ్వానంగా ఉంది. పేరుకు మున్సిపాలిటీ పరిధిలో ఉంటున్నా తమ కాలినీలో ఏలాంటి మౌలిక వసతులు లేవని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు నుండి నెల్లూరు పాలెం మధ్యలో రోడ్డు పక్కనే ఉండే వీవర్స్ కాలనీలో 40 ఏళ్ళ క్రితం చేనేత కార్మికుల కోసం సుమారు 60 ఇళ్ళను నిర్మించారు. అప్పటి నుండి చేనేత కార్మికులు తమ కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, ఈ కాలనీ నిర్మించిన సమయంలో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉండడం ఇక్కడ విశేషం.
రోడ్లు, సైడ్ కాలువలు, వీధిలైట్లు, కనీసం తాగునీటి వసతి కూడా లేకుండా ఈ కాలనీ ఉంటుంది. రాజకీయ నేతలు తమ గురించి పట్టించుకోకుండా గాలికి వదిలేసారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ మొత్తం ముళ్ళకంపతో చెత్తాచెదారముతో ఉందని.. రాత్రి సమయంలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని అంటున్నారు. వర్షం పడిందంటే మోకాలు లోతు బురదలో నడవాల్సిన పరిస్థితి తమదని దానికి తోడు సైడ్ కాలువలు లేకపోవడంతో ఇళ్లల్లో వాడే నీటిని రోడ్లపై వదిలేయవలసి వస్తుందని అంటున్నారు. గతంలో ఆనం రామనారాయణ రెడ్డి తాగునీటి వసతి ఏర్పాటు చేశారని ప్రస్తుతం ఆయనే తమకు మంత్రిగా రావడం వల్ల తమ సమస్యలు తీరుతాయనే ఆశ ఉందని ఈ కాలనీ వాసులు తెలిపారు.
Also Read: గిరిజనులకు తప్పని డోలి కష్టాలు.. మార్గ మధ్యలోనే..
AP: దిగ్విజయంగా కొనసాగుతోన్న రొట్టెల పండుగ.. వీడియో వర్చువల్ ద్వారా వీక్షించిన సీఎం చంద్రబాబు
Nellore: నెల్లూరు బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగ మూడో రోజు దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా రొట్టెల పండుగ ఏర్పాట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీడియో వర్చువల్ ద్వారా వీక్షించారు. అనంతరం భక్తులతో లైవ్లో మాట్లాడారు. రొట్టెల పండుగ ఘనచరిత్రను క్లుప్తంగా వివరించి, పండగ గొప్పతనంపై భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. దర్గా అభివృద్ధికి రూ. 5 కోట్లు మంజూరు చేశారు. భవిష్యత్తులో ఇంటర్నేషనల్ ఫెస్టివల్ గా రొట్టెల పండుగను నిర్వహించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని చంద్రబాబు తెలిపారు.
Also Read: పాడె మోసి గురు భక్తిని చాటుకున్న మాజీ మంత్రి కాకాణి..!
బారాషహీద్ దర్గాలో ఏర్పాటు చేసిన వీడియో వర్చువల్ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు రెడ్డి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి దర్గా వద్ద స్నానాల ఘాట్ల్ వద్ద, ప్రార్థనా మందిరాలవద్ద, సుమారు 10 ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశామని మంత్రులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్లు పాల్గొన్నారు.