నీలోఫర్ కేఫ్ క్లోజ్.. | Niloufer Cafe Closed | Telangana Bhavan Locked | KTR ACB Enquiry | RTV
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం 44వ హైవేపై బీఆర్ఎస్ లీడర్ కిడ్నాప్ కలకలం చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా మామడకు చెందిన మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ నేత హరీశ్ను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తర్వాత ఆయన దుండగుల నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు.
KCR ఎర్రవల్లి ఫాంహౌస్లో వరుస ప్రమాదాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందు కేసీఆర్, తర్వాత ఇప్పుడు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డ కాలు జారిపడటంతో ఫాంహౌస్లో దుష్టశక్తులున్నాయని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే సందేపపడుతున్నారు.
కేసీఆర్కు మద్దతుగా హైదరాబాద్లోని BRK భవన్కు రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు హైదరాబాద్కు చేరుకుంటున్నారు. BRK భవన్ వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్లో కవిత లేఖ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. లేఖ వివాదం తర్వాత మొదటి సారి కవిత ఆమె భర్తతో కలిసి కేసీఆర్ను కలిశారు. ఎర్రవల్లి ఫామ్హౌస్కు వెళ్లి బుధవారం ఉదయం తండ్రి కేసీఆర్తో కవిత భేటీ అయ్యారు.
కాళేశ్వరం కమిషన్ మిచారణ చేపట్టనున్న జస్టిస్ ఘోష్ కమిటీ ముందుకు బుధవారం మాజీ సీఎం KCR హాజరుకానున్నారు. నేడు ఉదయం 11.30 నిమిషాలకు విచారణకు రానున్నారు. ఇప్పటి వరకు ఓపెన్ కోర్టులోనే కమిషన్ విచారణ చేయగా.. ప్రస్తుతం ఇన్ కెమెరా ముందు కేసీఆర్ను ప్రశ్నించనుంది.
BRSని BJPలో విలీనం చేయాలని ఆ పార్టీ నాయకులు KCR దగ్గరకొచ్చారని కవిత మీడియా ముందు చెప్పిన విషయం తెలిసిందే. అయితే దీనిపై కేసీఆర్ క్లారిటీ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆలేరులో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ నేత కేటీఆర్కు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన రూ.25వేల కోట్ల అవినీతి ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ ఆరోపణలపై ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు.