/rtv/media/media_files/2025/05/30/9sSKgVEBsv1YicTK5dgs.jpg)
14ఏళ్ల కుర్రాడు ఐపీఎల్లో చెలరేగిపోయాడు. గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా అతనిపై ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. తన స్ట్రోక్ ప్లేతో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడతను. నేరుగా ప్రధాని మోదీనే ఆరోజు అతన్ని కలిశాడు. కేవలం 35 బాల్స్లో సెంచరీ కొట్టి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఆ పిల్లాడి పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండదు. ఐపీఎల్ హిస్టరీలో అతను సెన్సెషన్ క్రియేట్ చేశాడు. అతను ఎవరో కాదు వైభవ్ సూర్యవంశీ. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న బౌలర్లకు తన బ్యాటింగ్తో చుక్కలు చూపించాడు. ఐపీఎల్ 2025 సిజన్ 18లో రాజస్తాన్ రాయల్స్ తరుపున ఆడిన అతను ఇండియా మొత్తం ఫేమస్ అయ్యాడు.
Also Read: వ్యాన్ నదిలో పడి బీజేపీ నాయకురాలు గల్లంతు.. మరో 8మంది
Also Read: బుద్ధి మార్చుకోని పాక్.. పుల్వామా తరహా దాడికి స్కెచ్.. ఇదిగో ప్రూఫ్!
PM Modi Meets Vaibhav Suryavanshi
At Patna airport, met the young cricketing sensation Vaibhav Suryavanshi and his family. His cricketing skills are being admired all over the nation! My best wishes to him for his future endeavours. pic.twitter.com/pvUrbzdyU6
— Narendra Modi (@narendramodi) May 30, 2025
Also Read: ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి..ఒకే వేదికపై ఉగ్రవాదులు, పాక్ మంత్రులు
బీహార్ పర్యటనలో ఉన్న మోదీ పాట్నా విమానాశ్రయంలో వైభవ్ను కలిశారు. వైభవ్ తల్లిదండ్రులు కూడా మోదీని కలిశారు. వైభవ్ మోదీని పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నాడు. యంగ్ క్రికెటర్ను కలిసిన విషయాన్ని ప్రధాని తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు. వైభవ్ క్రికెట్ నైపుణ్యాన్ని యావత్ దేశం కీర్తిస్తున్నదని మోదీ పోస్ట్లో పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నట్లు ప్రధాని తెలిపారు. ఐపీఎల్లో 7 మ్యాచ్లు ఆడిన వైభవ్ సూర్యవంశి మొత్తం 252 రన్స్ స్కోర్ చేశాడు.
Also Read : పర్యాటకుడిపై పులి దాడి.. వీడియో వైరల్
pm-modi | ipl | cricketer | bihar | latest-telugu-news | young cricketer Vaibhav Suryavanshi