BJP Leader Missing: వ్యాన్ నదిలో పడి బీజేపీ నాయకురాలు గల్లంతు.. మరో 8మంది

సిక్కింలో గురువారం రాత్రి పర్యటకుల వ్యాన్ తీస్తా నదిలో పడిపోయింది. దీంతో స్పాట్‌లోనే ఓ వ్యక్తి మృతి చెందాడు. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న మిగిలిన తొమ్మిది మంది నదిలో గల్లంతు అయ్యారు. గల్లంతైన వారిలో బీజేపీ లీడర్ ఇతి శ్రీ నాయక్ జెనా కూడా ఉన్నారు.

New Update
Teesta River

ఒడిశా, కోల్‌కతా నుంచి వెళ్తున్న పర్యటకుల వాహనం అదుపు తప్పి లోయలో పడింది. సిక్కింలో గురువారం రాత్రి టూరిస్టుల వ్యాన్ తీస్తా నదిలో పడిపోయింది. ఈఘోర రోడ్డు ప్రమాదంలో అప్పటికప్పుడే ఓ వ్యక్తి మృతి చెందాడు. దాదాపుగా 1000 అడుగుల ఎత్తు నుంచి వాహనం పడిపోయినట్లు అధికారులు చెప్పారు. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న మిగిలిన తొమ్మిది మంది నదిలో గల్లంతు అయ్యారు. గల్లంతైన వారిలో బీజేపీ లీడర్ ఇతి శ్రీ నాయక్ జెనా కూడా ఉన్నారు. లాచెన్ నుంచి లాంచుంగ్ వెళ్తుండగా వ్యాన్ మలుపు తిరిగే సమయంలో ప్రమాదం జరిగింది.

Also Read :  తగ్గనంటున్న హమాస్‌.. కాల్పుల విరమణకు నో

BJP Leader Missing In Teesta River

Also Read :  ఏపీలో మరో లవ్‌స్టోరీ.. ప్రేమ విఫలమైందని బాలిక ఆత్మహత్యాయత్నం

వ్యాన్‌లో డ్రైవర్‌తో సహా 10 మంది ఉన్నారు. వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. మరొక పర్యాటకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం గ్యాంగ్‌టక్‌లోని ఆస్పత్రికి తరలించారు. భారత సైన్యం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, సిక్కిం పోలీసులు సంఘటనా స్థలం రాత్రంతా సహాయచర్యలు చేశారు.

Also Read :  బాలయ్యకు అవార్డుల పంట.. సర్ప్రైజ్ అవార్డుతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!

Also Read :  కిటికీ నుంచి నోట్ల వర్షం.. అవాక్కయిన జనం...

teesta-river | bjp-leader | BJP leader missing | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు