Pakistan: ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి..ఒకే వేదికపై ఉగ్రవాదులు, పాక్ మంత్రులు

తమకు, ఉగ్రవాదానికి ఏం సంబంధం లేదంటూ పాకిస్తాన్ బుకాయిస్తూనే ఉంది. కానీ ఎప్పటికప్పుడు ఆ దేశమే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందనే ఆధారాలు దొరుకుతూనే ఉన్నాయి. తాజాగా ఉగ్రవాదులు, పాకిస్తాన్ మంత్రులూ కలిసి ఒకే వేదికను పంచుకున్న ఫోటో ఒకటి బయటపడింది. 

New Update
pak

Terrorists, and pak minister

పాకిస్తాన్ ప్రభుత్వం..ఉగ్రవాదానికి చేయూతనిస్తోంది అనడానికి బలమైన ఆధారం ఒకటి బయటకు వచ్చింది. భారత్ ఎంతో కాలంగా పాకిస్తాన్ ప్రభుత్వమే ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తుందని చెబుతోంది. కానీ పాకిస్తాన్ మాత్రం లేదు లేదంటూ బుకాయిస్తోంది. అయితే తాజాగా మే 28న పాకిస్తాన్ లో పంజాబ్ ప్రావిన్స్ లో భారత్ కు వ్యతిరేకంగా ఒక ర్యాలీ జరిగింది. ఇందులో ఆ దేశపు మంత్రులు, లష్కరే తోయిబా ఉగ్రవాదులు కలిసి వేదికను పంచుకున్నారు. పాకిస్తాన్ అణు పరీక్షలకు గుర్తుగా యూమ్-ఏ-తక్బీర్ కార్యక్రమంలో వీరంతా తమ భారత వ్యతిరేకతను వ్యక్తం చేశారు.

ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు..

భారత్ కు వ్యతిరేకంగా జరగిన ర్యాలీలో పాకిస్తాన్ ఆహార మంత్రి మాలిక్ రషీద్ అహ్మద్ ఖాన్, పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ మాలిక్ ముహమ్మద్ అహ్మద్ ఖాన్ ఇద్దరూ పాల్గొన్నారు. వీరిద్దరూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు చాలా క్లోజ్. ర్యాలీలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు సైఫుల్లా కసూరి, తల్హా సయీద్ (హఫీజ్ సయీద్ కుమారుడు) మరియు అమీర్ హంజా లు కూడా పాల్గొన్నారు. అందరూ కలిసి ఒకే వేదిక మీద కూర్చుని భారత్ కు వ్యతిరేకంగా విషం కక్కారు. పహల్గాందాడికి ప్రధాన సూత్రధారి సైఫుల్లా కసూరి అని నిఘా వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు ఈ ర్యాలీలో మంత్రి మాలిక్ రషీద్ మాట్లాడుతూ.. నేడు 24 కోట్ల మంది పాకిస్థానీలకు సైఫుల్లా కసూరి, హఫీజ్ సయీద్ వంటి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారని బహిరంగంగానే ప్రకటించారు. అలాగే రీసెంట్గా భారత్ జరిపిన దాడుల్లో మురిడ్కే దాడిలో కీలకమైన ఉగ్రవాది లష్కర్ కమాండర్ ముదాసిర్ హతమయ్యాడు. ఇతడి సోదరుడికి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుందని కూడా ఆయన ప్రకటించారు.

మంత్రి తరువాత సైఫుల్లా కూడా మాట్లాడాడు.  పహల్గామ్ ఉగ్రవాద దాడికి సూత్రధారి అని నన్ను నిందించారు, ఇప్పుడు నా పేరు ప్రపంచానికి తెలిసిందని అంటూ మాట్లాడాడు. ఇతనిని ఐఎస్ఐ ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది. ఈ మొత్తం ర్యాలీలో భారత్ కు వ్యతిరేకంగా అందరూ నినాదాలు చేశారు. ఇందులో ఖలిస్తాన్ ఉగ్రవాదులు కూడా ఉన్నారు. వీరు భారత్ లో అశాంతిని రెచ్చగొట్టాలని బహిరంగంగానే పిలుపునిచ్చాడు.  

today-latest-news-in-telugu | pakistan | terrorists

Also Read: UNO layoffs: ట్రంప్ దెబ్బ.. ఐక్యరాజ్యసమితిలో భారీ లేఆఫ్స్!

 

 

Advertisment