/rtv/media/media_files/2025/05/30/3yMENibyAYd994gj05sn.jpg)
Terrorist Hafiz Saeed
Pakistan: ఎవరెంత చెప్పినా, ప్రపంచం అంతా వ్యతిరేకిస్తున్నా పాకిస్తాన్ మాత్రం బుద్ది పోనిచ్చుకోవడం లేదు. భారత్ దాడులతో కాళ్ళ బేరానికి వచ్చింది కానీ మళ్ళీ వెనుక నుంచి గోతులు తవ్వేందుకు మాత్రం సిద్ధమయింది. ఇందుకు నిదర్శనమే పాకిస్తాన్ లో ప్రస్తుతం జరుగుతున్న ర్యాలీలు. ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ నిషేధిత సంస్థ జమాత్-ఉద్-దవా పాకిస్తాన్ లోని ప్రాన నగరాల్లో భారత్ కు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తోంది. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీలాంటి వాటితో సహా మొత్తం 50 నగరాల్లో ఈ ర్యాలీలను నిర్వహించింది. దీనిలో పాక్ మర్కజీ ముస్లిం లీగ్ పార్టీ కూడా పాల్గొంటోంది. PMML సమావేశాలు సమాఖ్య, పంజాబ్ మరియు సింధ్ ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగాయి. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఎక్కువ ర్యాలీలు జరిగాయి.
పాక్ ఆర్మీతో కలిసి కుట్ర..
హఫీజ్ సయీద్ నిర్వహించిన ఈ ర్యాలీలో పాక్ మంత్రులు, ఆర్మీ కూడా పాల్గొంటోంది. ఈ ర్యాలీల్లో ఉగ్రవాద నాయకుల ప్రసంగాలు, మంత్రుల మాటలు చూస్తుంటే పాకిస్తాన్ మరో దాడికి ప్లాన్ చేస్తోందని అనుమానం బలపడుతోంది. తాజాగా మే 28న పాకిస్తాన్ లో పంజాబ్ ప్రావిన్స్ లో భారత్ కు వ్యతిరేకంగా ఒక ర్యాలీ జరిగింది. ఇందులో ఆ దేశపు మంత్రులు, లష్కరే తోయిబా ఉగ్రవాదులు కలిసి వేదికను పంచుకున్నారు. పాకిస్తాన్ అణు పరీక్షలకు గుర్తుగా యూమ్-ఏ-తక్బీర్ కార్యక్రమంలో వీరంతా తమ భారత వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఇందులో ఖలిస్తాన్ ఉగ్రవాదులు కూడా పాల్గొంటున్నారు. వీరు భారత్ లో అశాంతిని రెచ్చగొట్టాలని బహిరంగంగానే పిలుపునిచ్చారు.
Also Read: హైదరాబాద్లో అమానుషం.. కారుపై గీత పడ్డందుకు ఖతం చేశాడు!
ఉగ్రవాది నాయకుడు హఫీజ్ సయీద్...భారత్ లో మరో దాడికి కుట్ర చేస్తున్నాడని...దాని కోసమే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీకి మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్నాడని అంటున్నారు. .. పాక్ ఆర్మీ తో కలిసి.. భారత సైన్యాన్ని దెబ్బ కొట్టేలా పుల్వామా మాదిరి ఎటాక్ కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ, మంత్రులు కూడా హఫీజ్ సయీద్ ర్యాలీలకు అటెండ్ అవడం, అక్కడ భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడ్డం చూస్తుంటే మరో దాడి పక్కా అని తెలుస్తోంది. పుల్వామా తరహాలో ఈ దాడి ఉండొచ్చునని అంటున్నారు. అప్పుడు కూడా పాక్ ఆర్మీ సహకారంతోనే ఉగ్రవాదులు భారత సైన్యంపై దాడి చేశారు. ఇప్పుడు కూడా అలాంటిదే ప్లాన్ చేసి ఉండొచ్చునని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: Stock Market: నిన్న చివర్లో తేరుకున్న సూచీలు ఇవాళ మళ్ళీ నష్టాల్లోకి..
Also Read: వివో మామ దించేశాడు భయ్యా.. రెండు కిర్రాక్ స్మార్ట్ఫోన్లు అదిరిపోయాయ్!