/rtv/media/media_files/2025/02/24/9jdvArNCyRBCdisVgViC.jpg)
pak fan india Photograph: (pak fan india)
Champions Trophy IND vs PAK: దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ ఉత్కంఠబరితంగా సాగింది. పాక్, టీమిండియా నువ్వానేనా అన్నట్లుగా గ్రౌండ్లో పోటీని కనబరిచాయి. ఏకంగా లైవ్ స్ట్రీమింగ్లో 60.2 కోట్ల మంది అభిమానులు ఈ మ్యాచ్ను వీక్షించారు. విరాట్ కోహ్లి సెంచరీతో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. పాక్ ఫ్యాన్స్ కూడా ఇండియా విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే విధంగా టీమిండియా ఆడింది. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీసి పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్ను కుప్పకూల్చాడు. అదే విధంగా కోహ్లీ గ్రీస్లో నిలబడి సెంచరీతో చెలరేగాడు. దీంతో గేమ్ ఛేంజ్ అయి భారత్ సులభంగా గెలిచే అవకాశాలు వచ్చాయి.
Also Read: Tamilanadu: నటి పై రాజకీయ నేత అత్యాచారం.. ఏడుసార్లు అబార్షన్..కోర్టు సంచలన తీర్పు!
Pakistan fan wears India's jersey over Pakistan's during CT match in Dubai #indvspak #indiancricketteam #viratkohli #latestnews pic.twitter.com/W6Xu20BWl0
— Sports Today (@SportsTodayofc) February 23, 2025
Also Read: Russia vs Ukraine: మళ్లీ రెచ్చిపోయిన రష్యా.. ఉక్రెయిన్పై క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడులు!
పాక్ అభిమానులే ఫిదా..
ఇండియా క్రికెటర్ల ఆటకు ఏకంగా పాక్ అభిమానులే ఫిదా అయ్యారు. ఇండియా గెలుస్తోందనే టైంలో ఓ పాక్ టీం అభిమాని జర్సీ మార్చి అతని మద్దతును ఇండియాకు తెలిపాడు. ముందుగా పాకిస్థాన్ జట్టు జర్సీని ధరించిన వ్యక్తి ఇండియా మ్యాచ్ గెలుస్తోందనే సమయంలో టీమిండియా జర్సీ ధరించాడు. ఇదంతా వెనుకనున్న కొందరు వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.
The Love for Kohli is Unmatchable! 🫶❤️ pic.twitter.com/0Vgj51MnfS
— Virat Kohli Fan Club (@Trend_VKohli) February 23, 2025