Teamindia: టీమిండియాకు భారీ క్యాష్ ప్రైజ్.. మొత్తం ఎన్ని కోట్లో తెలుసా?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచిన టీమిండియాకి బీసీసీఐ భారీ క్యాష్ ప్రైజ్ను ప్రకటించింది. ఛాంపియన్స్కు మొత్తం రూ.58 కోట్ల ప్రైజ్ మనీని అందజేయనున్నట్లు తెలిపింది. ఈ మనీని ఆటగాళ్లు, కోచ్లు, సపోర్ట్ స్టాఫ్, సెలెక్షన్ కమిటీకి అందజేస్తారు.