India vs Pakistan: భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌.. ఆ జట్టు ఓడిపోతుంది: కుంభమేళాలో బాబా సంచలన వ్యాఖ్యలు (వీడియో)!

భారత్-పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌కు ముందు కుంభమేళాలో IIT బాబాగా పేరుగాంచిన అభయ్ సింగ్ జోస్యం చెప్పారు. ఆ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో ఆయన అంచనా వేశారు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత్ ఓడిపోతుందని ఆయన అన్నారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

New Update
Maha Kumbh IIT Baba shocking prediction before India vs Pakistan

Maha Kumbh IIT Baba shocking prediction before India vs Pakistan Match

India vs Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ 2025(Champions Trophy 2025)లో భాగంగా ఫిబ్రవరి 19 నుంచి మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. మొదటి మ్యాచ్ పాకిస్తాన్ vs న్యూజిలాండ్(Pakistan vs New Zealand) మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించింది. సెకండ్ మ్యాచ్ భారత్ vs బంగ్లాదేశ్(India vs Bangladesh) మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడంతా భారత్ vs పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్ వైపే చూస్తున్నారు. 

Also Read: Maha Kumbh: కుంభమేళాలో నీటి నాణ్యతపై యోగి సర్కార్ చీటింగ్.. తప్పుడు రిపోర్ట్ పై ఎన్జీటీ సీరియస్!

ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం(Dubai International Cricket Stadium)లో జరగనుంది. దీనికోసం యావత్ ప్రపంచ క్రికెట్ ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ట్రోఫీలో ఇతర జట్లతో మ్యాచ్ ఓ రకమైతే.. భారత్-పాకిస్థాన్‌తో మ్యాచ్ మరో రకం అనే చెప్పాలి. దాయాదుల పోరు కోసం అందరూ తహతహలాడుతున్నారు. 

Also Read: Maha Kumbh Mela 2025: కుంభమేళాలో మహిళల వీడియోలు షేర్ ..  15 సోషల్ మీడియా అకౌంట్లపై కేసు బుక్  !

నెక్స్ట్ మ్యాచ్‌లో భారత్

ఇప్పటికే బంగ్లాపై ఆధిపత్య విజయంతో భారత్ బరిలోకి దిగింది. ఇకపై జరగబోతున్న మ్యాచ్‌లలో సైతం విజయం సాధించాలని టీమిండియా(Team India) పట్టుదలతో ఉంది. మరోవైపు న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్ 60 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇలాంటి సమయంలో నెక్స్ట్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోతుందని ఓ బాబా జోస్యం చెప్పాడు. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

Also Read: Satya Nadella: ఇంటర్వ్యూ కోసం ఏకంగా సత్య నాదెళ్లకే మెయిల్‌..ఎంత సేపటిలో రిప్లై వచ్చిందో తెలుసా!

IIT బాబా జోస్యం

IIT బాబాగా(IIT Baba) పిలవబడే అభయ్ సింగ్ ICC ఛాంపియన్స్ ట్రోఫీలో జరగబోయే ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ గురించి అంచనా వేశారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్)లో పోస్ట్ చేయబడిన వీడియో ప్రకారం IIT బాబా మాట్లాడుతూ.. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారతదేశం గెలవదని పేర్కొన్నారు. ‘‘నేను మీకు ముందుగానే చెబుతున్నాను. ఈసారి భారతదేశం గెలవదు’’ అని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు