/rtv/media/media_files/2025/08/25/bcci-2025-08-25-11-45-34.jpg)
ఆసియా కప్ 2025(Asia cup 2025) కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీమ్ ఇండియా ప్రధాన స్పాన్సర్ అయిన డ్రీమ్11(dream-11) తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.దీంతో, ఆసియా కప్లో భారత జట్టు ఎలాంటి ప్రధాన స్పాన్సర్షిప్ లోగో లేకుండానే బరిలోకి దిగనుందా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల భారత ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు 2025ను ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త చట్టం ప్రకారం, డ్రీమ్11 వంటి రియల్ మనీ గేమింగ్ ప్లాట్ఫారమ్లకు సంబంధించిన ప్రకటనలు, ప్రమోషన్లు నిషేధించబడ్డాయి. ఈ కారణంగానే డ్రీమ్11 తన స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
Also Read : Madharaasi Trailer: ఏఆర్ మురుగదాస్ మరో యాక్షన్ థ్రిల్లర్.. 'మదరాశి' ట్రైలర్ అదిరింది!
🚨 BCCI BREAKS TIE WITH DREAM 11. 🚨
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 25, 2025
- The BCCI has parted ways with Dream XI and says to not indulge with such organisations in future. (TOI). pic.twitter.com/ifYJrP6cwj
రూ. 358 కోట్లకు ఒప్పందం
డ్రీమ్11 గతంలో బైజూస్ స్థానంలో 2023 జూలైలో రూ. 358 కోట్లకు మూడేళ్ల కాలానికి భారత జట్టుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ఇంకా ఓ ఏడాది పాటు కొనసాగాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వ నిర్ణయంతో అది మధ్యలోనే ముగిసింది. ఇప్పుడు, ఆసియా కప్ ముంగిట బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నప్పటికీ, సమయం తక్కువగా ఉండటంతో జట్టు స్పాన్సర్ లోగో లేకుండానే టోర్నమెంట్లో ఆడే అవకాశం ఉంది. ఈ పరిస్థితి బీసీసీఐకి ఆర్థికంగా కూడా కొంత నష్టం కలిగించవచ్చు.
Also Read : Hyderabad: లవర్తో కలిసి మొగుణ్ని లేపేసింది బండరాయితో.. హైదరాబాద్లో మరో దారుణం!
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుండి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) లోని దుబాయ్, అబుదాబి స్టేడియాలలో జరుగుతుంది.వాస్తవానికి ఈ టోర్నమెంట్కు భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది, కానీ పాకిస్తాన్తో ఉన్న దౌత్యపరమైన సమస్యల కారణంగా UAEలో నిర్వహిస్తున్నారు.ఈ టోర్నమెంట్ T20 ఫార్మాట్లో జరుగుతుంది. రాబోయే 2026 T20 ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 8 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి: భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, UAE, ఒమన్, హాంకాంగ్. మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 9న అబుదాబిలో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ హాంకాంగ్ జట్ల మధ్య జరుగుతోంది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. గ్రూప్ దశలో ఈ మ్యాచ్ తర్వాత, సూపర్-4 దశలో లేదా ఫైనల్లో కూడా ఈ జట్లు మరోసారి తలపడే అవకాశం ఉంది.గత ఎడిషన్ (2023 వన్డే ఫార్మాట్)లో భారత్ విజేతగా నిలిచింది. అంతకు ముందు, 2022లో జరిగిన T20 ఫార్మాట్ ఆసియా కప్ను శ్రీలంక గెలుచుకుంది.
Also Read : Stray Dogs: కేంద్రం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా వీధి కుక్కలకు వ్యాక్సినేషన్.