Stray Dogs: కేంద్రం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా వీధి కుక్కలకు వ్యాక్సినేషన్

ఇటీవల సుప్రీంకోర్టు వీధి కుక్కలకు టీకాలు, స్టెరిలైజేషన్ వేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

New Update
Stray Dogs

Stray Dogs

ఇటీవల సుప్రీంకోర్టు వీధి కుక్కలకు టీకాలు, స్టెరిలైజేషన్ వేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కనీసం 70 శాతం శునకాలకు టీకాలు, స్టెరిలైజేషన్ తప్పనిసరి చేసింది. అనంతరం మళ్లీ వాటిని ఉన్నచోటే విడిచిపెట్టాలని ఆదేశించింది. ఇంతకుముందు కేంద్రం ఈ నిబంధనలను కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేసింది. కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ప్రతి రాష్ట్రం కూడా ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు నెలవారీ రిపోర్టును సమర్పించాలని ఆదేశించింది. 

Also Read: విదేశీ వస్తువులు కొనకండి : మోదీ కీలక ప్రకటన

అంతేకాదు కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు వీధి కుక్కలకు సంబంధించి సబ్సిడీని కూడా ప్రకటించింది. ఒక్కో శునకానికి రూ.800, అలాగే ఒక్కో పిల్లికి రూ.600 చొప్పున అందించనుంది. అలాగే అన్ని నగరాల్లో వీధి కుక్కలకు ఆహారం అందించే కేంద్రాలు, రేబిస్ కంట్రోల్ యూనిట్స్, షెల్టర్‌ హోమ్స్‌ అందించేందుకు కూడా ప్రత్యేకంగా నిధుల విడుదల చేస్తామని తెలిపింది. చిన్న షెల్టర్ల కోసం రూ.15 లక్షలు, పెద్ద షెల్టర్ల కోసం రూ.27 లక్షల వరకు నిధులు కేటాయించనుంది. జంతు ఆస్పత్రులు, సంరక్షణ కేంద్రాల కోసం కేంద్రం ఒకేసారి రూ.2 కోట్ల నిధులు మంజూరు చేయనుంది. 

Also Read: రష్యాకు మరో షాక్.. ఉక్రెయిన్‌కు మళ్లీ ఆయుధాలు సరఫరా చేస్తున్న అమెరికా

ఇదిలాఉండగా దేశవ్యాప్తంగా చూసుకుంటే గతేడాది 37 లక్షల మంది కుక్కకాటుకు గురయ్యారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే రేబిస్‌ మరణాల్లో భారత్‌ నుంచే 36 శాతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. బాధితుల్లో కూడా ఎక్కవ మొత్తంలో 15 ఏళ్ల లోపు ఉన్నవాళ్లే ఉన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఢిల్లీలో రోడ్లపై వీధి కుక్కుల కనిపించొద్దని వాటిని సంరక్షణ కేంద్రాలకు తరలించాలని తీర్పునిచ్చింది. ఈ అంశం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేపింది. జంతు ప్రేమికులు, పలువురు సెలబ్రిటీలు శునకాల పట్ల కరుణ చూపించాలని కోరారు. మరికొందరు నిరసనలు కూడా చేశారు. చివరికి దీనిపై వెనక్కి తగ్గిన అత్యున్నత న్యాయస్థానం దేశవ్యాప్తంగా వీధి కుక్కలకు టీకాలు, డీవార్మింగ్‌ చేయించాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisment
తాజా కథనాలు