Munaf Patel: ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలింగ్‌ కోచ్‌‌కు బిగ్ షాక్

ఢిల్లీ బౌలింగ్‌ కోచ్‌ మునాఫ్‌ పటేల్‌కు మ్యాచ్‌ ఫీజులో 25 శాతం జరిమానా పడింది. బుధవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విషయం చెప్పేందుకు ఆటగాడిని పంపించగా మ్యాచ్ అధికారి అడ్డుకున్నాడు. దీంతో మునాఫ్‌ అతనితో వాగ్వాదానికి దిగడంతో జరిమానా విధించారట.

author-image
By Kusuma
New Update
Munaf Patel

Munaf Patel

ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలింగ్‌ కోచ్‌ మునాఫ్‌ పటేల్‌కు మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధించారు. బుధవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో మునాఫ్ ఐపీఎల్‌ నియమావళిని ఉల్లంఘించినందుకు రిఫరీ జరిమానాతో పాటు ఒక అయోగ్యత పాయింట్‌ను కూడా ఇచ్చాడు. అయితే ఈ మ్యాచ్‌లో చివరకు రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం సాధించింది. దీంతో ఢిల్లీ బౌలింగ్‌ కోచ్‌ మునాఫ్‌కు మ్యాచ్‌ ఫీజులో 25 శాతం జరిమానా పడింది.

Also Read :  జేఈఈ మెయిన్ కీ తొలగించిన ఎన్టీఏ.. ఫలితాల విడుదలపై గందరగోళం!

Also Read :  భూమన కరుణాకర్‌రెడ్డికి బిగ్ షాక్..

కారణం ఏంటనే విషయం క్లారిటీ లేదు..

అలాగే అతని ఖాతాలో అయోగ్యత పాయింట్‌ కూడా చేరింది. అయితే ఏ కారణంతో మునాఫ్‌కు ఈ శిక్ష విధించారన్న విషయం మాత్రం క్లారిటీ లేదు. ఢిల్లీ ప్లేయర్లకు మునాఫ్ సందేశాన్ని చెప్పేందుకు ఒక ఆటగాడిని పంపించడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో మ్యాచ్‌ అధికారి ఆటగాడిని అడ్డుకోవడంతో మునాఫ్‌ అతడితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. అందుకే మునాఫ్‌పై జరిమానా వేసినట్లు తెలుస్తోంది.

Also Read :  పాస్టర్లకు గుడ్ న్యూస్.. గౌరవ వేతనం అందించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

Also Read :  మా ఆర్థిక వ్యవస్థకు ట్రంప్ అత్యంత ప్రమాదకారి..కెనడా ప్రధాని మార్క్

 

telugu-news | latest-telugu-news | today-news-in-telugu | telugu-sports-news | telugu-cricket-news | latest sports News | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు