/rtv/media/media_files/2025/04/15/s4YqV2xmPDNnCtLejusK.jpg)
Jee Main Exam
దేశ వ్యాప్తంగా జేఈఈ విద్యార్థులు టెన్షన్ లో ఉన్నారు. ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీల మధ్యలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ సెషన్ ఫైనల్ కీ ని నిన్న ఎన్టీయే విడుదల చేసిది. అయితే కొద్దిసేపటకే దాన్ని మళ్ళీ తొలగించింది. తరువాత మళ్ళీ ఈరోజు అప్డేట్ చేస్తామని చెప్పింది అయితే అప్పటి నుంచి ఎన్టీయే ఉలుకూ పలుకూ లేకుండా ఉంది. మెయిన్స్ కీ ని పెట్టలేదు...దానికి సంబంధఘించిన ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర గందరగోళానికి గురౌతున్నారు. ఎన్టీయే పద్ధతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ఇద్దరు పిల్లలను కొడవలితో నరికి చంపిన తల్లి.. అసలు కారణం అదే.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!
Also Read : మైనర్ బాలుడు దారుణ హత్య.. న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్న కుటుంబ సభ్యులు
కీ లో రెండు ప్రశ్నలు తప్పు..
జేఈఈ 2025 మెయిన్స్ ఫలితాలను ఎన్టీయే ఎప్పుడూ కటాఫ్తో పాటు ప్రకటిస్తుంది . జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాన్ని అడ్వాన్స్డ్, అఖిల భారత ర్యాంక్ హోల్డర్లు, ఇంకా రాష్ట్రాల వారీగా టాపర్లకు కటాఫ్తో పాటు ప్రకటిస్తారు. అందులో బాగంగానే నిన్న సాయంత్రం విడుదలైన జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ పరీక్ష తుది జవాబు కీ పేపర్ 1 లో రెండు ప్రశ్నలు తొలగించబడ్డాయి. మొదటి ప్రశ్న ఏప్రిల్ 3 మొదట షిఫ్ట్ డొమెస్టిక్ సెట్ లో కనిపించింది. రెండవ ప్రశ్న ఏప్రిల్ 2 మొదటి షిఫ్ట్ ఇంటర్నేషనల్ సెట్ నుండి తొలగించబడింది. అయితే సెషన్ 2 జవాబు కీ లో వ్యత్యాసాలున్నాయని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. చాలా మంది సోషల్ మీడియాలో ఫిర్యాదులు కూడా చేశారు. దీంతో వెంటనే కీను తొలగించింది ఎన్టీయే. అ్పటి నుంచి మళ్ళీ కొత్తది పెట్టలేదు. ఈ సంవత్సరం JEE మెయిన్స్ రెండు రౌండ్లలో నిర్వహించారు. జనవరి, ఏప్రిల్లో రెండు సార్లు పరీక్షలు జరిగాయి. ఒక అభ్యర్థి రెండు సెషన్లలోనూ హాజరై ఉంటే, JEE మెయిన్లో అభ్యర్థి సాధించిన అత్యుత్తమ స్కోర్లను తుది మెరిట్ జాబితాను తయారు చేసేటప్పుడు పరిగణనలోకి తీసుకుంటారు.
Also Read: India-China: అమెరికాకు బాయ్..చైనాకు హాయ్..భారతీయులపై చైనా వీసాల వర్షం
Also Read : ఆ స్టార్ క్రికెటర్లు న్యూడ్ ఫొటోలు పంపారు.. దుమారం రేపుతున్న కోచ్ కూతురు వీడియో!
nta | today-latest-news-in-telugu | jee mains 2025 | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | national news in Telugu