TG News: 'తెలంగాణకు కృష్ణా నీటిలో 70% వాటా?'
కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 70% వాటా వచ్చేలా కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ముందు వాదించాలని సూచించారు. కృష్ణా బేసిన్లో 70% తెలంగాణలో, 30% మాత్రమే ఏపీలో ఉందన్నారు.