/rtv/media/media_files/2025/05/21/kcdEtx7Cbx8vR2bWrwst.jpg)
Supreme Court
నీట్ పీజీ ప్రవేశ పరీక్షపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షను వాయిదా వేసేందుకు నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (NEB)కు పర్మిషన్ ఇచ్చింది. ఆగస్టు 3న పరీక్ష నిర్వహించేందుకు ఒకే చెప్పింది. ఒకే షిఫ్ట్లో పరీక్షను ముగించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే పరీక్ష నిర్వహణ తేదీని జూన్ 15 నుంచి మార్చుకోవడం కోసం అవకాశం కల్పించింది.
Also Read: అలెర్ట్.. అలెర్ట్.. 5 వేలు దాటిన కరోనా కేసులు, 58 మరణాలు
NEET-PG Exam 2025 On Hold
ఇక వివరాల్లోకి వెళ్తే.. వైద్యవిద్యలో పీజీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్షకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించేందుకు నీట్ నిరాకరించింది. దీనివల్ల సమస్యలు వస్తున్నాయని చెప్పింది. పరీక్షకు పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని.. సురక్షితమైన పరీక్ష కేంద్రాలను ఎంచుకోవాలని సూచనలు చేసింది.
Also Read: 'నేను దొంగను కాదు'.. సంచలన విషయాలు వెల్లడించిన విజయ్ మాల్యా
నీట్ పీజీ 2025ని రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తామని వచ్చిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరగగా దీనిపై ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆధునిక సాంకేతిక వచ్చాక దేశమంతా ఒకే షిఫ్టులో నిర్వహించడం సాధ్యం కాదని అధికారుల అభ్యంతారాలను తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పరీక్ష తేదీని కూడా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
Also Read: ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం..కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహం
Also Read : ఇకపై కీప్యాడ్ ఫోన్లలోనూ ఫోన్పే.. కంపెనీ అదిరిపోయే ఫీచర్!
telugu-news | rtv-news | neet | neet-pg-exam | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | national news in Telugu