/rtv/media/media_files/2025/06/06/O7F2m9coeYgGeGzfp3qL.jpg)
Vijay malya
బ్యాంకులకు రూ.9 కోట్లు ఎగవేసి లండన్కు పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా గురించి అందరికీ తెలిసిందే. ఆయన్ని అక్కడి నుంచి భారత్కు తీసుకొచ్చి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి ఫలించడం లేదు. తాజాగా విజయ్ మాల్యా మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ పలు కీలక విషయాలు పంచుకున్నారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యే పరిస్థితులు ఉండటంతోనే తాను భారత్ విడిచి వెళ్లిపోయానని చెప్పారు.
తాను దొంగతనం చేయలేదని.. అసలు ఇక్కడ దొంగతనం ఎక్కడ జరిగిందంటూ ప్రశ్నించారు. భారత్ నుంచి పారిపోయానని..నేను దొంగను కాదంటూ తేల్చిచెప్పారు. '' భారత్ విడిచి నేను వెళ్లినందకు నన్ను పారిపోయిన వ్యక్తిగా చూడండి.. కానీ నాపై దొంగ అని ముద్ర వేయకండి. ముందస్తు ప్లాన్లో భాగంగానే 2016లో నేను ఇండియా నుంచి విదేశాలకు వెళ్లాను. కానీ వివిధ కారణాల వల్ల మళ్లీ భారత్కు రాలేకపోయాను. అసలు దొంగతనం అనే విషయం ఎక్కడి నుంచి వచ్చింది.
Also Read: బెంగళూరు ఘటనపై ప్రభుత్వం దూకుడు...కొనసాగుతున్న అరెస్టుల పర్వం
Also Read : ఇకపై కీప్యాడ్ ఫోన్లలోనూ ఫోన్పే.. కంపెనీ అదిరిపోయే ఫీచర్!
Vijay Mallya Defends Himself
భారత్లో న్యాయపరమైన దర్యాప్తు, గౌరవప్రదమైన జీవితం ఉంటుందని హామీ ఇస్తే తిరిగి వచ్చే దానిపై ఆలోచించేవాడ్ని. కానీ అలా ఉండదని నాకు తెలుసు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ పునర్నిర్మాణ ప్లాన్తో నేను అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని సంప్రదించాను. ఆ సమయంలో నేను సమస్యల్లో ఉన్నట్లు చెప్పాను. ఆర్థిక మాంద్యంలో నేను పనిచేయనని.. ఇందుకోసం కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ విమానాల సంఖ్యను తగ్గించి, ఉద్యోగులను తొలగించాలని భావిస్తున్నానని చెప్పాను. కానీ నాకు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవద్దని.. బ్యాంకుల నుంచి సపోర్ట్ ఉంటుందని ప్రణబ్ ముఖర్జీ హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల దేశాన్ని వీడాల్సి వచ్చిందని'' విజయ్ మాల్యా తెలిపారు.
ఒక కుట్ర ప్రకారం నా మీద దొంగ, ఫ్రాడ్ అనే ముద్ర వేశారు..
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) June 6, 2025
బ్యాంకులకు డబ్బులు చెల్లిస్తా అని చెప్పినా ఆ అవకాశం కూడా ఇవ్వకుండా అనేక రెట్లు నా ఆస్తులు జప్తు చేశారు
నన్ను ఆర్ధిక నేరగాడు, దేశం వదిలి పారిపోయాడు అని అన్న వాళ్ళు నాకన్న పెద్ద క్రిమినల్స్
- విజయ్ మాల్యా#VijayMallya… pic.twitter.com/2bhbOGeEbI
Also Read: గుడ్ న్యూస్..వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ
ఇదిలాఉండగా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ లోన్ల ఎగవేత, మనీలాండరింగ్ వ్యవహారంలో విజయ్ మాల్యాపై ఆరోపణలు ఉన్నాయి. 2016లో దేశం నుంచి వెళ్లిపోయిన ఆయన అప్పటి నుంచి బ్రిటన్లోనే ఉంటున్నారు. ఆయన్ని భారత్కు రప్పించేందుకు కేంద్ర ప్రయత్నం అనేక ప్రయత్నాలు చేస్తోంది. దీంతో తాను తీసుకున్న లోన్లకు అనేక రేట్లు బ్యాంకులు తన నుంచి వసూలు చేశాయని.. వీటికి సంబంధించిన అకౌంట్ స్టేట్మెంట్లను అందించాలని కోరుతూ ఇటీవల విజయ్ మాల్యా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
Also Read : కేసీఆర్, హరీష్ రావుపై మంత్రి ఉత్తమ్ సంచలన ఆరోపణలు
telugu-news | rtv-news | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu