Covid-19 Cases: అలెర్ట్.. అలెర్ట్‌.. 5 వేలు దాటిన కరోనా కేసులు, 58 మరణాలు

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ వైరస్‌కు గురైన వారి సంఖ్య తాజాగా 5 వేలు దాటడం కలకలం రేపుతోంది. అలాగే ఇప్పటిదాకా కరోనా వల్ల దేశంలో 55 మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

New Update
India reports 4 Covid-19 deaths in 24 hours, active cases rise to 5,364

India reports 4 Covid-19 deaths in 24 hours, active cases rise to 5,364

Covid-19 Cases: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ వైరస్‌కు గురైన వారి సంఖ్య తాజాగా 5 వేలు దాటడం కలకలం రేపుతోంది. అలాగే ఇప్పటిదాకా కరోనా వల్ల దేశంలో 55 మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కేంద్ర ఆరోగ్యశాఖ డేటా ప్రకారం చూసుకుంటే.. జూన్ 6న ఉదయం 8 గంటల వరకు దేశంలో కరోనా యాక్టీవ్ కేసులు సంఖ్య 5364కు చేరింది. గత 24 గంటల్లో 498 కొత్త కేసులు వచ్చాయి. నలుగురు మృతి చెందారు. 

RTV News App: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

RTV News App Download Links: 

ఆండ్రాయిడ్(Android) వినియోగదారులు: https://t.co/B1FaPB6Zsr

IOS వినియోగదారులు: https://t.co/4nRQaLbtfv

Also Read: 'నేను దొంగను కాదు'.. సంచలన విషయాలు వెల్లడించిన విజయ్ మాల్యా

మృతుల్లో ఇద్దరు కేరళకు చెందినవారు ఉన్నారు. మరొకరు పంజాబ్, ఇంకొకరిది కర్ణాటక. అయితే కేరళలో అత్యధికంగా 1679 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత గుజరాత్, వెస్ట్‌ బెంగాల్, ఢిల్లీలో ఎక్కువగా కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. కేసుల సంఖ్య ప్రస్తుతం వేగంగా పెరుగుతోందని.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. అలాగే అత్యవసర వైద్య సదుపాయాలు.. ఆక్సిజన్‌తో పాటు అవసరమైన వైద్య సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశించింది. అలాగే వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 

Also Read: ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం..కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహం

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5364 ఉండగా.. ఇందులో 1679 కేసులు కేరళలో నమోదయ్యాయి. ఆ తర్వాత గుజరాత్‌ 615, వెస్ట్‌ బెంగాల్‌ 596, ఢిల్లీ 592, మహారాష్ట్ర 548తో పాటు ఇతర రాష్ట్రాల్లో పలు కేసులు నమోదయ్యాయి. ఇక ఏపీలో 62, తెలంగాణలో 5 కేసులు వచ్చాయి. అయితే అరుచల్‌ప్రదేశ్‌, మిజోరాంలో మాత్రం ఎలాంటి కేసు నమోదు కాలేదు. 

Also Read: బెంగళూరు ఘటనపై ప్రభుత్వం దూకుడు...కొనసాగుతున్న అరెస్టుల పర్వం

 

national-news | rtv-news | corona-cases

RTV LIVE Telugu News App

 

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు