/rtv/media/media_files/2025/06/06/fYEZ0Z6VuYjF4U016Zm8.jpg)
India reports 4 Covid-19 deaths in 24 hours, active cases rise to 5,364
Covid-19 Cases: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ వైరస్కు గురైన వారి సంఖ్య తాజాగా 5 వేలు దాటడం కలకలం రేపుతోంది. అలాగే ఇప్పటిదాకా కరోనా వల్ల దేశంలో 55 మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కేంద్ర ఆరోగ్యశాఖ డేటా ప్రకారం చూసుకుంటే.. జూన్ 6న ఉదయం 8 గంటల వరకు దేశంలో కరోనా యాక్టీవ్ కేసులు సంఖ్య 5364కు చేరింది. గత 24 గంటల్లో 498 కొత్త కేసులు వచ్చాయి. నలుగురు మృతి చెందారు.
RTV News App: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!
సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండి..
— RTV (@RTVnewsnetwork) June 4, 2025
RTV న్యూస్ యాప్ ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్క్లూజీవ్ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV న్యూస్ యాప్ ను ప్లేస్టోర్లో అప్డేట్చేసుకోండి. ఈ కింది లింక్స్ పై క్లిక్ చేసి నేరుగా మీ… pic.twitter.com/ImFUCn2AfR
RTV News App Download Links:
ఆండ్రాయిడ్(Android) వినియోగదారులు: https://t.co/B1FaPB6Zsr
IOS వినియోగదారులు: https://t.co/4nRQaLbtfv
Also Read: 'నేను దొంగను కాదు'.. సంచలన విషయాలు వెల్లడించిన విజయ్ మాల్యా
మృతుల్లో ఇద్దరు కేరళకు చెందినవారు ఉన్నారు. మరొకరు పంజాబ్, ఇంకొకరిది కర్ణాటక. అయితే కేరళలో అత్యధికంగా 1679 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత గుజరాత్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీలో ఎక్కువగా కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. కేసుల సంఖ్య ప్రస్తుతం వేగంగా పెరుగుతోందని.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. అలాగే అత్యవసర వైద్య సదుపాయాలు.. ఆక్సిజన్తో పాటు అవసరమైన వైద్య సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశించింది. అలాగే వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Also Read: ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం..కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహం
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5364 ఉండగా.. ఇందులో 1679 కేసులు కేరళలో నమోదయ్యాయి. ఆ తర్వాత గుజరాత్ 615, వెస్ట్ బెంగాల్ 596, ఢిల్లీ 592, మహారాష్ట్ర 548తో పాటు ఇతర రాష్ట్రాల్లో పలు కేసులు నమోదయ్యాయి. ఇక ఏపీలో 62, తెలంగాణలో 5 కేసులు వచ్చాయి. అయితే అరుచల్ప్రదేశ్, మిజోరాంలో మాత్రం ఎలాంటి కేసు నమోదు కాలేదు.
Also Read: బెంగళూరు ఘటనపై ప్రభుత్వం దూకుడు...కొనసాగుతున్న అరెస్టుల పర్వం
national-news | rtv-news | corona-cases