/rtv/media/media_files/2025/05/06/NqJ8lCXwe2HqJAfp1STf.jpg)
Blood Donation
జార్ఖండ్లో దారుణం వెలుగు చూసింది. చాయ్బసాలో తలసీమియా(thalassemia) వ్యాధితో బాధపడుతున్న ఐదుగురు చిన్నారులకు(children) హెచ్ఐవీ పాజిటివ్(hiv-positive) నిర్ధారణ కావడం కలకలం సృష్టిస్తోంది. బ్లడ్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి ఐదుగురు జీవితాలను చీకట్లోకి నెట్టారు. స్థానిక బ్లడ్ బ్యాంక్లో రక్తం ఎక్కించుకున్న తర్వాత తలసీమియా వ్యాధితో బాధపడుతున్న తమ ఏడేండ్ల కుమారుడికి హెచ్ఐవీ సోకిందని శుక్రవారం ఓ బాధిత కుటుంబం వైద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జార్ఖండ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి.. విచారణ నిమిత్తం ఉన్నతస్థాయి మెడికల్ టీంని ఏర్పాటు చేసింది.
Also Read : SCR కీలక నిర్ణయం.. ఈ రైల్వేస్టేషన్కు ఛత్రపతి శంభాజీ పేరు
Transfuse Blood Of HIV Positive Jharkhand
ఈ వైద్య బృందం విచారణ జరపగా, మరో నాలుగు కేసులు వెలుగులోకి వచ్చాయి. వైద్య బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ దినేశ్ కుమార్ సదర్ ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంకును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తలసీమియా రోగికి కలుషిత రక్తం ఎక్కించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఈ క్రమంలో బ్లడ్ బ్యాంకును పరిశీలించాం. బ్లడ్ బ్యాంకులో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించామని, దానిపై విచారణ చేస్తున్నామన్నారు. లోపాలను సరి చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించామని డాక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు.
Also Read : మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. లొంగిపోయిన 71 మంది మావోలు
Follow Us