Southwest monsoon : నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి

అనేక ఏండ్ల తర్వాత తొలిసారి రోహిణికార్తెలోనే  వానాకాలం వచ్చేసింది.ఎండకాలం పూర్తిగా పోకముందే నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణను పలకరించాయి. అనుకున్న సమయం కంటే 13 రోజుల ముందే నైరుతిరుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి.

New Update
 Monsoon arrives in Kerala, earliest onset since 2009, Says IMD

Southwest monsoon has arrived

Southwest monsoon: అనేక ఏండ్ల తర్వాత తొలిసారి రోహిణికార్తెలోనే  వానాకాలం వచ్చేసింది.ఎండకాలం పూర్తిగా పోకముందే నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణను పలకరించాయి. అనుకున్న సమయం కంటే 13 రోజుల ముందే నైరుతిరుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. నైరుతి రుతు పవనాలు ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే మూడు రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తెలంగాణలోని పాలమూరు జిల్లాను తాకిన నైరుతి రుతు పవనాలతో వాతావరణం చల్లబడింది. జిల్లాతో పాటు అక్కడక్కడ చిరు జల్లులు పడుతున్నాయి. మరో నాలుగు రోజులపాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

ఇది కూడా చూడండి: SRH VS KKR: హ్యాట్రిక్ విజయం..కేకేఆర్ ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్

మరోవైపు ఉత్తర తెలంగాణపై ద్రోణి కొనసాగుతుంది.ఈ నేపథ్యంలో తెలంగాణలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళ, తమిళనాడులో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ర్టంలో అతి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికతో  రాష్ట్రంలోని 10 జిల్లాల్లో స్కూల్స్, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది . 

Also Read: దేశంలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే?

ఏపీలో కూడా నైరుతి రుతు పవనాల ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో నైరుతి రుతు పవనాలు త్వరితగతిన విస్తరిస్తున్నాయి. అనుకున్న సమయం కంటే 13 రోజుల ముందుగానే  రుతుపవనాలు ఏపీని తాకాయి. దీంతో రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి తోడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతున్నది. ఈ అల్పపీడనం బలపడితే.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా పడనున్నాయి.

Also Read: నీ అక్రమ సంబంధం సీక్రెట్ నీ భార్యకు చెబుతా.. ఇంజనీర్‌ను బ్లాక్ మెయిల్ చేసిన AI!

ఉపరితల ద్రోణి, నైరుతి రుతు పవనాల ప్రభావంతో తెలంగాణ లోని , మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి  జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. 

Also Read :  అమెరికాలో మరోసారి కాల్పులు.. 11 మందికి పైగా..?

Advertisment
Advertisment
తాజా కథనాలు