BIG BREAKING: భారత్, పాకిస్థాన్ ల మధ్య యుద్ధం మరింత తీవ్రమవుతోంది. పాకిస్థాన్ తన కవ్వింపు చర్యలు వీడడం లేదు. తాజాగా సరిహద్దు రాష్ట్రాల్లోని జనావాసాలే లక్ష్యం గా పాక్ దాడులు చేస్తోంది. ఈ క్రమంలో అధికారులు పంజాబ్ లోని అమృత్ సర్ లో మళ్లీ రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు గ్రీన్ అలర్ట్ జారీ చేసిన కొద్దిసేపటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. వైమానిక దాడి హెచ్చరిక సైరన్లు మోగాయి. దీంతో పెద్ద ఎత్తున భద్రతాదళాలు మోహరించాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొవడానికి అధికారులు అప్రమత్తమై పౌరులను అలర్ట్ చేస్తున్నారు. ప్రజలెవరూ ఇళ్లనుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.
Also Read: భారత్-పాక్ మధ్య హైటెన్షన్.. తెలంగాణ సర్కార్ ప్రకటించిన టోల్ ఫ్రీ నంబర్లు ఇవే!
పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై దాడులతో రెచ్చిపోయిన పాకిస్థాన్ ఇష్టానుసారంగా భారత్పై డ్రోన్లతో విరుచుకుపడింది. దీన్ని తిప్పికొట్టడంతో తోక ముడిసింది. ఇక సరిహద్దు రాష్ర్టాలను టార్గెట్గా చేసుకుని పాక్ మిస్సల్స్ను ప్రయోగిస్తోంది. దీంతో శనివారం తెల్లవారుజామున భారత్ పాకిస్తాన్లోని నాలుగు వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. దానికి ప్రతీగా పాకిస్థాన్ ఢిల్లీ వైపు ఫతా-2 క్షిపణిని ప్రయోగించింది. అయితే దీన్ని గుర్తించిన భారత్ సైన్యం సిర్సాలో అడ్డగించి కూల్చివేసింది.
ఇది కూడా చూడండి: IND-PAK WAR: వైమానిక దాడులు పగలు కాకుండా రాత్రే ఎందుకు జరుగుతాయి.. సీక్రెట్ ఇదే!
అయితే సామాన్య ప్రజలు, ప్రార్థనా మందిరాలు, దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ దాడులకు తెగబడుతోంది.ఓవైపు డ్రోన్లతో దాడులు చేస్తూనే సరిహద్దులో కాల్పులకు పూనుకొంటుంది. ఈ రోజు ఉదయం పాక్ జరిపిన కాల్పుల్లో జమ్మూకశ్మీర్ ప్రభుత్వ అధికారి రాజ్ కుమార్ మరణించారు. ప్రభుత్వం ప్రజలను ఎప్పటి కప్పుడు అప్రమత్తం చేస్తున్నప్పటికీ పాకిస్థాన్ జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లతో సహా భారతదేశం అంతటా పాకిస్తాన్ డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఇప్పటికే పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో పంజాబ్ సరిహద్దుల్లో 16 మంది చనిపోయారు. వారిలో ఓ జవాన్ కూడా ఉన్నాడు.
Also Read: 'నాన్న అమ్మకు చెప్పకు.. నన్ను వెళ్ళనివ్వదు'.. వ్యోమికా సింగ్ సక్సెస్ స్టోరీ ఇదే!