/rtv/media/media_files/2025/05/09/FX5dO3cxIcEXGFcYfmw6.jpg)
IND-PAK WAR: వైమానిక దాడులు పగలు కాకుండా రాత్రి పూట చేసేందుకు ప్రత్యేక కారణం ఉంది. సర్జికల్ స్ట్రైక్, ఆపరేషన్ సిందూ కూడా రాత్రే జరిగింది. అయితే పగటిపూట డ్రోన్లు, విమానాలను రాడార్తోపాటు సైనికులు ఎలక్ట్రో-ఆప్టికల్ ద్వారా గుర్తించగలరు. కానీ రాత్రి రాడర్ మాత్రమే గుర్తిస్తుంది. అది మిస్ అయితే ఆపరేషన్ సక్సెస్ అయినట్లేనని రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ కల్నల్ దన్వీర్ సింగ్ చెబుతున్నారు.
బాలాకోట్,సర్జికల్ స్ట్రైక్ రాత్రే..
2025 మే 6-7 రాత్రిని పాక్ ఎప్పటికీ మరచిపోలేదు. భారత్ 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే ఆపరేషన్ సిందూను భారత్ రాత్రిపూటనే చేపట్టింది. 2019లోనూ బాలాకోట్ వైమానిక దాడి, సర్జికల్ స్ట్రైక్లను భారత సైన్యం రాత్రిపూట నిర్వహించింది. ఈ నేపథ్యంలో రాత్రిపూట మాత్రమే వైమానిక దాడులు ఎందుకు జరుగుతాయి? పగటిపూట వైమానిక దాడులు ఎందుకు చేయరు అనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంది. అయితే ఈ అంశాలపై మాజీ కల్నల్ దన్వీర్ సింగ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
Also Read: BIG BREAKING: పాక్ ఫైటర్ జెట్ పైలెట్ ను సజీవంగా పట్టుకున్న భారత్
'రాత్రిపూట విమానాలు లేదా డ్రోన్లు సులభంగా కనిపించవు కాబట్టి చీకటిలో వైమానిక దాడులు జరుగుతాయని అందరూ అనుకుంటారు. కానీ అసలు కారణం అది కాదు. పగలు దాడికి చేస్తే ఎలక్ట్రో-ఆప్టికల్ సిస్టమ్ను ఉపయోగించి లక్ష్యాన్ని సులభంగా ట్రాక్ చేస్తాం. ఆప్టికల్ సహాయంతో పగలు ఈజీగా గుర్తించి వాటిని కూల్చేస్తాం. పగటిపూటచేసే దాడి రాడార్ దృష్టితోపాటు దేశ సైనికుల దృష్టిలో పడుతుంది. కానీ రాత్రి అలా కాదు. రాత్రి ఆప్టికల్ వినియోగించలేం. రాత్రిపూట దాడిచేసే విమానాలను ఎలక్ట్రానిక్ రాడర్ మాత్రమే ట్రాక్ చేస్తుంది. అది మిస్ అయితే శత్రువు ఆపరేషన్ సక్సెస్ అయినట్లే' అని ఆయన వివరించారు. అందుకే ఏ దేశమైనా రాత్రిపూటనే దాడులకు పాల్పడుతుందని, రాత్రి లక్ష్యాన్ని ఈజీగా ట్రేస్ చేయొచ్చని ఆయన చెబుతున్నారు.
Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్పై ఖర్గే సంచలన కామెంట్స్!
ind pak war | drone | bomb | today telugu news