/rtv/media/media_files/2025/05/09/A2p9aAUPJfWWHYPvj6cC.jpg)
India-PAK Attack Latest Updates
సరిహద్దు రాష్ట్రాల్లో నివాసం ఉండే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పాక్-భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు రాష్ట్రాల్లో ప్రస్తుతం నివసిస్తున్న,చిక్కుకున్న తెలంగాణ వాసులకు సకాలంలో సహాయం, సమాచారం, సేవలను అందించడం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఈ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. నిరంతరాయంగా సేవలను అందించడానికి ఈ కంట్రోల్ రూమ్ 24 గంటల పాటు పని చేయనుంది. ఈ మేరకు ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.గౌరవ్ ఉప్పల్ ప్రకటన విడుదల చేశారు.
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల దృష్ట్యా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. సరిహద్దు రాష్ట్రాల్లో ఉంటున్న, చిక్కుకున్న తెలంగాణ వాసులు కంట్రోల్ రూమ్ నంబర్ 011-23380556 ను సంప్రదించాలని సూచించింది.#OperationSindoor pic.twitter.com/vEVAO0OQM8
— AIR News Hyderabad (@airnews_hyd) May 9, 2025
కంట్రోల్ రూమ్ నంబర్లు..
ల్యాండ్ లైన్: 011-23380556
వందన, రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రటరీ: 9871999044
హైదర్ అలీ నఖ్వీ, రెసిడెంట్ కమిషనర్ వ్యక్తిగత సహాయకుడు: 9971387500
జి. రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్: 9643723157
సిహెచ్. చక్రవర్తి, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్: 9949351270
(telangana-news | telugu-news | india operation sindoor | ind pak war )