RCB Stampede: తొక్కిసలాట ఘటన.. గవర్నర్‌, -సీఎం మధ్య వివాదం

ఇటీవల బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన ఇప్పుడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ మధ్య తీవ్ర వివాదంగా మారుతోంది.

New Update
Raj Bhavan Disputes CM’s ‘No Role’ Claim, Says Siddaramaiah Invited Governor To RCB Event

Raj Bhavan Disputes CM’s ‘No Role’ Claim, Says Siddaramaiah Invited Governor To RCB Event

ఇటీవల బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన ఇప్పుడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ మధ్య తీవ్ర వివాదంగా మారుతోంది. విధాన్‌ సౌధలో జరిగిన కార్యక్రమాన్ని తాము ఏర్పాటు చేయలేదని సీఎం సిద్ధరామయ్య ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్‌ థావర్‌చంద్‌ను.. సీఎం సిద్ధరామయ్యే అధికారికంగా ఈ విజయోత్సవ వేడుకకు ఆహ్వానించారని రాజ్‌భవన్‌ వెల్లడించింది.  

Also Read: భార్య టార్చర్‌ భరించలేకపోతున్నా: ఆర్మీ జవాన్‌

Raj Bhavan Disputes CM’s ‘No Role’ Claim

ముందుగా ఆర్సీబీ టీమ్‌కు రాజ్‌భవన్‌లో ఆతిథ్యం ఇవ్వాలని అనుకున్నారు. అయితే ఈ అంశంపై గవర్నర్‌ కార్యాలయం రాష్ట్ర చీఫ్ సెక్రటరీని సంప్రదించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేయాలని కోరింది. కానీ ఇలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే విధాన సౌధాలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని చీఫ్‌ సెక్రటరీ తెలిపారు. విధాన సౌధలో నిర్వహించే ఆర్సీబీ ఆటగాళ్ల అభినందన కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం.. గవర్నర్‌ను ఆహ్వానించారని రాజ్‌భవన్‌ తెలిపింది. 

అయితే తొక్కిసలాట ఘటన స్టేడియం వద్ద జరిగిందని.. విధానసౌధ కార్యక్రమం సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదని కర్ణాటక సర్కార్‌ అంటోంది. విపక్షాలు దీన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాయని ఆరోపణలు చేసింది. అంతేకాదు ఈ కార్యక్రమానికి తాను ఆహ్వానితుడిని మాత్రమేనని.. రెండు గంటలు ఆలస్యంగా తనకు తొక్కిసలాట సమాచారం అందిందని సిద్ధరామయ్య తెలిపారు. విధాన సౌధలో వేడుకకు క్రికెట్‌ వర్గాల నుంచి తనకు ఆహ్వానం వచ్చిందని.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాదని తెలిపారు. అలాగే తనను స్టేడియం వద్ద జరగనున్న కార్యక్రమానికి ఆహ్వానించలేదని చెప్పారు. 

Also Read: భార్య టార్చర్‌ భరించలేకపోతున్నా: ఆర్మీ జవాన్‌

మరోవైపు ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమానికి ముందు డీసీపీ ఎంఎన్‌ కరిబసవన గౌడ.. ఉన్నతాధికారులకు లేఖ రాశారు. '' ఆర్సీబీకి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. విధానసౌధలో వేడుక నిర్వహిస్తే లక్షలాది మంది అభిమానులు వచ్చే ఛాన్స్ ఉంది. సిబ్బంది కొరత వాళ్ల అభిమానులను నియంత్రించడం కష్టమవుతుంది. స్టేడియంలోకి వచ్చేందుకు జారీ చేస్తున్న ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో ఎంట్రీ పాస్‌లు నిలిపివేయాలని'' లేఖలో రాసుకొచ్చారు. మొత్తానికి ఈ తొక్కిసలాట ఘటన ఇప్పుడు సీఎం, గవర్నర్‌ల మధ్య వివాదం రేపుతోంది. 

Also Read: రష్యా ఐదేళ్లలో నాటో దేశాలపై దాడులు చేసే ఛాన్స్.. హెచ్చరించిన జనరల్ సెక్రటరీ

Also Read :  బరితెగిచింది.. అక్రమ సంబంధం కోసం భర్త, పిల్లలకు స్లో పాయిజన్

 

telugu-news | rtv-news | RCB Stampede | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu | bengalore | karnataka-cm-siddaramaiah

Advertisment
Advertisment
తాజా కథనాలు