రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా నాటో జనరల్ సెక్రటరీ మార్క్ రూట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి ముప్పును ఎదుర్కోవాలంటే నాటో సభ్యదేశాలు తమ రక్షణ రంగాన్ని 400 శాతం పెంచుకోవాలని హెచ్చరించారు. ఐదేళ్లలో రష్యా అమెరికా, యూకే సహా నాటో దేశాలపై దాడులు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read: ట్రంప్ తప్పు చేశాడా.. అధికారాన్ని దుర్వినియోగం చేశాడా.. అమెరికా చట్టాలు ఏం చెబుతున్నాయి?
అలాగే ఈ నెల చివర్లో నెదర్లాండ్లో జరగనున్న సదస్సులో 32 నాటో దేశాలు తమ మిలటరీ వ్యయాన్ని పెంచుకుంటాయని ఆశిస్తున్నానని తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న భీకర దాడులతో నాటో దేశాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ఉక్రెయిన్తో కొనసాగుతున్న యుద్ధంలో రష్యా ఒకే రాత్రిలో దాదాపు 500 డ్రోన్లతో దాడులు చేసిందని ఉక్రెయిన్ వాయుసేన తెలిపింది.
Also Read: మొన్న నేషనల్ గార్డ్స్..ఈరోజు 700 మంది మెరైన్స్..మరింత రణరంగంగా లాస్ ఏంజెల్స్
మరోవైపు ఉక్రెయిన్పై రష్యా వరుస డ్రోన్ దాడులతో విరుచుకుపడుతోంది. సోమవారం రాత్రి ఉక్రెయిన్పై 315 షాహెద్ డ్రోన్లతో దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఏడుగురు మృతి చెందారు. మరో 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. 315 డ్రోన్లతో సహా ఉత్తర కొరియాకు చెందిన కేఎన్ బాలిస్టిక్ క్షిపణులు, ఐదు ఇస్కాండర్కె క్రూయిజ్లను ప్రయోగించింది. అయితే 213 డ్రోన్లు, ఏడు క్షిపణులను రష్యా నేలకూల్చినట్లు ఉక్రెయిన్ ఎయిర్ఫోర్స్ పేర్కొంది.
Also Read: భారతీయ విద్యార్థిపై అమెరికా అధికారుల కర్కశం.. వీడియో వైరల్