QRSAM కోసం ఇండియా రూ.30వేల కోట్లు.. త్వరలో సూపర్ పవర్స్

క్విక్ రియాక్షన్ సర్ఫేస్ - టు - ఎయిర్ మిస్సైల్ (QRSAM)ని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తయారు చేస్తోంది. ఇది పూర్తిగా భారతదేశంలో తయారు చేయబడుతుంది. ఈఏడాది చివరిలోపు అందుబాలు లోకి రానుంది. దీని కోసం ప్రభుత్వం దాదాపు రూ. 30,000 కోట్లు ఖర్చు చేస్తుంది.

New Update
QRSAM

భారత సైన్యం త్వరలో శక్తివంతమైన క్షిపణి(Missile) వ్యవస్థను అందిపుచ్చుకోనుంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 30,000 కోట్లు ఖర్చు చేస్తుంది. ఈ నిర్ణయం రక్షణ మంత్రిత్వ శాఖ త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. క్విక్ రియాక్షన్ సర్ఫేస్ - టు - ఎయిర్ మిస్సైల్ (QRSAM)ని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తయారు చేస్తోంది. ఇది పూర్తిగా భారతదేశంలో తయారు చేయబడుతుంది. ఈఏడాది చివరిలోపు అందుబాలు లోకి రానుంది. ఈ క్షిపణి వ్యవస్థను ముఖ్యంగా పశ్చిమ, ఉత్తర సరిహద్దులలో మోహరించనున్నారు. జూన్ నాల్గవ వారంలో రక్షణ మంత్రిత్వ శాఖ సమావేశం జరగనుంది. దీనిలో ఈ ప్రణాళికను ఆమోదించవచ్చు. ఇది భారతదేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. 

Also Read: లాస్‌ఏంజెల్స్‌లో ఆందోళనలు.. రిపోర్టర్‌ కాలికి తగిలిన రబ్బరు తుటా (VIDEO)

ఈ క్షిపణి వ్యవస్థ చాలా వేగంగా పనిచేస్తుంది. ఇది కదులుతున్నప్పుడు కూడా శత్రు డ్రోన్లు లేదా విమానాలను ట్రాక్ చేసి అటాక్ చేస్తోంది. దీని పరిధి దాదాపు 30 కిలోమీటర్లు. ఈ తరహాలో భారత్ రక్షణ వ్యవస్థలో ఇప్పటికే ఆకాష్, MRSAM వంటి ఉన్నాయి.

Also Read: విమానం మెట్లు ఎక్కుతుండగా జారిపడ్డ ట్రంప్.. వీడియో వైరల్

 

Indian Air Force | latest-telugu-news | 2025 india pakistan war | today-news-in-telugu | national news in Telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు