Betting App: తండ్రీకొడుకును బలితీసుకున్న ఆన్ లైన్ బెట్టింగ్.. ఒకరికోసం మరొకరు దారుణం!

ఆన్ లైన్ బెట్టింగ్ కారణంగా మరో కుటుంబం ఆగమైంది. కరీంనగర్ జిల్లా మన్నెంపల్లికి చెందిన నిఖిల్ రావు అప్పులు చేసి చనిపోగా.. కొడుకు మరణం తట్టుకోలేక తండ్రి తిరుపతిరావు పురుగుల మందు తాగి మరణించారు. ఈ ఘటనపై సజ్జనార్ పోస్ట్ పెట్టి యువకులను హెచ్చరించారు.

New Update
Online betting suicide family

Betting app scam Father and son died in Karimnagar

Betting app: ఆన్ లైన్ బెట్టింగ్ మోసం కారణంగా తెలంగాణలో మరో కుటుంబం ఆగమైంది. డిగ్రీ చదువుతున్న యువకుడు కొంతకాలంగా ఈజీ మనీకోసం అలవాటుపడగా.. ఇందుకు ఆన్ లైన్ గేమ్ ఆడటం మొదలుపెట్టాడు. కొంతకాలానికి అనుకున్నదానికంటే ఎక్కువే కోల్పోవడంతో నెమ్మదిగా అప్పులు చేయడం మొదలుపెట్టాడు. అలా తీసుకున్న అప్పు తీర్చలేక పరువు పోతుందని భావించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే కొడుకు మరణం తట్టుకోలే తండ్రి కూడా తనువు చాలించిన దారుణమైన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో జరిగింది. అయితే ఈ ఘోరాన్ని ఉదహారణగా చూపిస్తూ యువకులను హెచ్చరించేందుకు సజ్జనార్ మరోసారి పోస్ట్ పెట్టారు. 

Also Read :  పదేళ్ల తర్వాత.. గూగుల్ లోగోలో ఆ మార్పులు

బెట్టింగ్ మానేసి చదువుకోవాలంటూ..

ఈ మేరకు మన్నెంపల్లికి చెందిన సిరికొండ నిఖిల్ రావు(22) హైదారాబాద్‌లో బీఎస్సీ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అయితే అప్పట్లో ఆన్ లైన్ బెట్టింగ్ వల్ల చాలా అప్పులు చేయగా తండ్రి తిరుపతిరావు తీర్చేశాడు. దీంతో కొంతకాలంగా బెట్టింగ్ కు దూరంగానే ఉంటున్న నిఖిల్.. మార్చిలో ఇంటికి వచ్చి కొద్దిరోజులకు హైదరాబాద్ తిరుగుపయనమయ్యాడు. దీంతో కరీంనగర్ బస్టాండ్ లో దింపిన తండ్రి.. మంచిగా చదువుకోవాలని హెచ్చరించాడు. అయితే తీవ్ర మనస్తాపానికి గురైన నిఖిల్ తండ్రి వెళ్లగానే మళ్లీ ఇంటికి వెళ్తూ తమ ఊరి పొలిమెరలోని బావిలో దూకి చనిపోయాడు. రైతులు అతన్ని గుర్తించి సమాచారం ఇవ్వగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎల్ఎండీ ఎస్సై వివేక్ తెలిపారు. 

Also Read: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?

పొలంలోనే పురుగుల మందు తాగి..

ఇదిలా ఉంటే.. ఎదిగిన కొడుకును కోల్పోయిన తిరుపతిరావు (49) మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఒక్కగానొక్క కొడుకు చావును తట్టుకోలేకపోయిన తిరుపతిరావు కొడుకు చనిపోయిన వారంరోజులకే తన వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగాడు. స్థానికులు గుర్తించి వెంటనే హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. దీంతో ఈ కుటుంబం గుండెలు పగిలేలా రోధిస్తుండగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రీకొడుకుల అకాల మరణం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. 

Also Read: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్‌ కూడా మేమే

సజ్జనార్ రిక్వెస్ట్ పోస్ట్..

ఈ దారుణాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. 'అత్యంత బాధాకరం. తన కొడుకు ఆన్ లైన్ బెట్టింగ్ భూతానికి బానిసై చనిపోతే.. మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురైన తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆన్ లైన్ బెట్టింగ్  కుటుంబాలను ఎంతలా కబలిస్తోందో తెలియజేసే ఘటన ఇది. ఆన్ లైన్ బెట్టింగ్ భూతం డిగ్రీ విద్యార్థిని బలి తీసుకుంది. చేతికి అందిన బిడ్డ బీఎస్సి అగ్రికల్చర్ పూర్తి చేసి వ్యవసాయ అధికారిగా స్థిరపడతాడునుకున్న తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేసింది. యువకుల్లారా!! ఈజీ మనీకి అలవాటుపడి బెట్టింగ్ కూపంలోకి వెళ్ళకండి. బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోకండి' అని కోరారు.  

Also Read :  ఉదయాన్నే ఒక స్పూట్ పసుపు, తేనె తీసుకుంటే.. ఎన్ని లాభాలో తెలుసా?

betting-app | sucide | son | father | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
తాజా కథనాలు