/rtv/media/media_files/2025/05/07/P3qvTCqJHY1lIhultxjc.jpg)
Pakistan intelligence may seek information on military train movements, Indian Railway cautions employees
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరిటి భారత సైన్యం పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్-పాక్ మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయితే భారత సైనిక రైళ్ల కదలికల గురించి తెలుసుకోవడం కోసం పాకిస్థాన్ నిఘా సంస్థలు ప్రయత్నించవచ్చనే సమాచారం వచ్చింది. ఈ క్రమంలోనే రైల్వేశాఖ అప్రమత్తమైంది. దీంతో రహస్య సమాచారాన్ని అనధికార వ్యక్తులతో షేర్ చేసుకోవద్దని రైల్వేశాఖ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది.
Also Read: కర్రెగుట్టల్లో ఎదురు కాల్పులు.. 26 మంది మావోయిస్టులు మృతి
మంగళవారమే దీనికి సంబంధించిన అడ్వైజరీ జారీ చేసింది. రహస్య సమాచారం బయటపడితే జాతీయ భద్రతకు ముప్పుగా ఉంటుందని పేర్కొంది.'' సైనిక స్పెషల్ రైళ్ల కదలికలకు సంబంధించి కీలక సమాచారాన్ని పాక్ ఇంటిలిజెన్స్ సంస్థలు రాబట్టే ఛాన్స్ ఉంది. రైల్వేలో మిలటరీ విభాగానికి తప్ప ఎలాంటి అనధికార వ్యక్తులకు ఇన్ఫర్మేషన్ లీక్ చేసినా భద్రతా ఉల్లంఘన చర్యలుగానే భావిస్తామని'' రైల్వే జోన్ల ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్లకు రైల్వే బోర్డు సందేశం పంపించింది.
Also Read: నా బాధ ఇప్పుడు తెలిసిందా.. ఆపరేషన్ సిందూర్పై హిమాన్షి రియాక్షన్!
ఇదిలాఉండగా మిలటరీ రైలు అనేది భారతీయ రైల్వేశాఖ ప్రత్యేక విభాగం. సైనిక పరంగా వ్యూహాత్మక ప్రణాళికల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, యుద్ధం లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సైనికులతో సహా ట్యాంకులు, పరికరాలు, ఇతర వస్తువుల రవాణా దీని ద్వారానే జరుగుతోంది. అయితే దీనికి అవసరమైన సంప్రదింపులు రైల్వేబోర్డు ద్వారా కాకుండా ఈ సైనిక విభాగం నుంచే జరుగుతాయి.
Also Read: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. మళ్లీ పారిపోయిన పాక్ ఆర్మీ చీఫ్!
Also Read: ఎలా దాడి చేశామంటే.. అఫీషియల్ వీడియోలు రిలీజ్ చేసిన ఆర్మీ (VIDEO)
Pahalgam attack | india pakistan war | Indian Army