/rtv/media/media_files/2025/05/07/53jUpPipqT2WCQ2xg1GL.jpg)
26 Maoists Killed in Karreguttalu
మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. బుధవారం ఉదయం కూడా తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కర్రెగుట్టల్లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలంలో ఇంకా కాల్పులు ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆపరేషన్ కగర్ పేరిట భద్రతా దళాలు మావోయిస్టులపై చర్యలకు దిగిన సంగతి తెలిసిందే.
Also Read: పాకిస్థాన్ ముర్దాబాద్.. అసదుద్దీన్ ఒవైసీ నినాదాలు (VIDEO VIRAL)
డీఆర్జీ, కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్, సీఏఎఫ్ బలగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఏడీజీ వివేకానంద సిన్హా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. అలాగే సీఆర్పీఎఫ్ ఐజీ రాకేశ్ అగర్వాల్, బస్తర్ రేంజ్ ఐజీ పి.సుందరరాజ్ ఈ ఆపరేషన్ గురించి వివరాలు ఆరాతీస్తూనే ఉన్నారు. తాజాగా జరిగిన దాడుల్లో మృతుల సంఖ్య మరింతగ పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: నా బాధ ఇప్పుడు తెలిసిందా.. ఆపరేషన్ సిందూర్పై హిమాన్షి రియాక్షన్!
దీన్ని ఏడీజీ వివేకానంద సిన్హా పర్యవేక్షిస్తున్నారు. సీఆర్పీఎఫ్ ఐజీ రాకేశ్ అగర్వాల్, బస్తర్ రేంజ్ ఐజీ పి.సుందరరాజ్ ఎప్పటికప్పుడు ఆపరేషన్పై ఆరా తీస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా ఏపీలో కూడా భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అల్లూరి జిల్లా వై.రామవరం, జీకేవీధి మండలాల సరిహద్దుల్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే రెండు ఏకే-47లను కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనాస్థలంలో ఇరుపక్షాల మధ్య ఇంకా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.
Also Read: విదేశాల భద్రతా సలహాదారులతో ఇండియన్ జేమ్స్బాండ్ అజిత్ దోవల్ కీలక సమావేశం
Also Read: ఎలా దాడి చేశామంటే.. అఫీషియల్ వీడియోలు రిలీజ్ చేసిన ఆర్మీ (VIDEO)
operation kagar | maoists