Operation Sindoor: నా బాధ ఇప్పుడు తెలిసిందా.. ఆపరేషన్ సిందూర్‎పై హిమాన్షి రియాక్షన్!

ఆపరేషన్ సిందూర్‎పై ఉగ్రవాద దాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్ స్పందించారు. 'నా భర్తను విడిచిపెట్టమని వేడుకున్నా వదల్లేదు. ఇప్పుడు నా బాధ ఎలా ఉంటుందో వారికి తెలిసింది' అంటూ ఎమోషనల్ అయ్యారు.

New Update
himansi

himansi Photograph: (himansi)

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‎పై ఉగ్రవాద దాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్ స్పందించారు. 'నా భర్తను విడిచిపెట్టమని వేడుకున్నా వదల్లేదు. ఇప్పుడు నా బాధ ఎలా ఉంటుందో వారికి తెలిసింది' అంటూ ఎమోషనల్ అయ్యారు.

పెళ్లైన ఆరు రోజులకే..

ఈ మేరకు హిమాన్షి నర్వాల్ మాట్లాడుతూ.. ఇది 26 మంది మృతుల కుటుంబాల బాధకు దక్కిన గౌరవం అన్నారు. మోదీ ప్రభుత్వం, భారత దళాలు ఉగ్రవాదులకు, వారి నిర్వాహకులకు ఆపరేషనన్ సిందూర్ ద్వారా బలమైన సందేశాన్ని ఇచ్చాయని కొనియాడారు. 26 మంది మృతుల కుటుంబాల బాధ ఇప్పుడు సరిహద్దు అవతల ఉన్నవారికి తెలిసిందన్నారు. 'ఆ రోజు నా భర్తను విడిచిపెట్టమని వేడుకున్నా. మాకు పెళ్లై ఆరు రోజులే అయిందని బతిమాలాను. కరుణించమని అడిగినా మోదీని అడగండి అంటూ చంపేశారు. ఈ రోజు మోదీ జీ, మన సైన్యం బలమైన సమాధానం చెప్పారు' అంటూ హిమాన్షి కన్నీరుపెట్టుకున్నారు. 

Also Read: పాకిస్థాన్ ముర్దాబాద్.. అసదుద్దీన్ ఒవైసీ నినాదాలు (VIDEO VIRAL)

2025, ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. 26 మంది టూరిస్టులను విచక్షణరహితంగా కాల్చి చంపేశారు. ఈ మృతుల్లో  లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ఒకరు కాగా.. పెళ్లి జరిగిన 6 రోజులకే తన భార్య హిమాన్షితో కలిసి పర్యాటక ప్రాంతంకు వెళ్లగా ఈ దారుణం జరిగింది. మృత దేహాం పక్కన హిమాన్షి నర్వాల్ కూర్చొని ఏడ్చిన తీరు యావత్ దేశాన్ని కన్నీరుపెట్టించింది. 

Pahalgam attack | telugu-news | today telugu news

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు