/rtv/media/media_files/2025/01/10/I4fvJ8UuOuHjKlNU73ok.jpg)
Rahul Gandhi
కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన మంచి మనస్సు చాటుకున్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా భారత్-పాక్ మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తల్లిదండ్రులను కోల్పోయిన 22 మంది పిల్లలను దత్తత తీసుకోవాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. జమ్మూకశ్మీర్లోని పూంచ్లో 22 మంది పిల్లల చదువు ఖర్చులను రాహుల్ గాంధీ భరిస్తారని తెలిపారు.
In a world where many turn away from pain, Shri @RahulGandhi ji has embraced it with compassion.
— Varun Choudhary (@varunchoudhary2) July 29, 2025
By adopting 22 children orphaned in the Poonch shelling and taking full responsibility for their education, he hasn’t just extended help — he’s given them hope, dignity, and a… pic.twitter.com/iLcLUdeJk5
ఇది కూడా చూడండి:బిచ్చగాళ్లకు బీరు, బిర్యానీ ఇచ్చి.. పోర్న్ చూపించి.. సృష్టి స్పెర్మ్ దందాలో సంచలన విషయాలు!
భారత్-పాక్ యుద్ధం సమయంలో..
భారత్-పాక్ కాల్పుల వల్ల సరిహద్దుల్లో ఉన్నవారిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. తల్లిదండ్రులను కోల్పోయిన వారు అనాథులు కారని, వారిని జీవితాంతం తాను చూసుకుంటానని, వారి పూర్తి ఖర్చులు కూడా తానే చూసుకుంటానని రాహుల్ తెలిపారు. ఆ పిల్లల చదువులకు సంబంధించి మొదటి విడత సహాయం విడుదల చేస్తామని ఇటీవల తెలిపారు. ఆ 22 మంది పిల్లలు డిగ్రీ పూర్తి అయ్యే వరకు బాధ్యత తనదేనని వెల్లడించారు.
This will warm your heart ❤️🚨
— Rohini Anand (@mrs_roh08) July 29, 2025
Rahul Gandhi has adopted 22 children who lost their parents in Poonch (J&K) during Op Sindoor
Beautiful gesture by RaGa, he is winning hearts. What a man 🫡❤️ pic.twitter.com/MOOpFdsSvm
ఇది కూడా చూడండి:China Floods: ముంచెత్తుతున్న భారీ వరదలు.. భయపడుతున్న ప్రజలు.. 34 మంది మృతి?
రాహుల్ గాంధీ మే నెలలో పూంచ్ పర్యటన సందర్భంగా స్థానిక పార్టీ నాయకులను కలిశారు. ఆ సమయంలో బాధిత పిల్లల జాబితాను రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి వారిని సర్వే చేసి ఓ జాబితాను తయారు చేశారు. అన్ని ప్రభుత్వ రికార్డులను క్రాస్-చెక్ చేసిన తర్వాత ఆ 22 పిల్లల పేర్లను ఖరారు చేశారు.
ఇది కూడా చూడండి:BIG BREAKING: నిమిష ఉరిశిక్ష రద్దు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర విదేశాంగ శాఖ
ఆ సమయంలో రాహుల్ గాంధీ క్రైస్ట్ పబ్లిక్ స్కూల్ను కూడా సందర్శించారు. ఆ స్కూల్లో కూడా కొందరు భారత్-పాక్ యుద్ధం సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన వారు ఉన్నారు. వారికి రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. పూంచ్ సరిహద్దుల్లో ఉండటంతో ఇక్కడ అనేక పాఠశాలలపై కాల్పులు జరిగాయి. ఈ సమయంలో చాలా మంది తల్లిదండ్రులు కాల్పుల్లో మృతి చెందారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ వారిని దత్తత తీసుకున్నారు.