/rtv/media/media_files/qUNIneda4moc3Y7Kssu4.jpg)
Madhya Pradesh: మతపరమైన ప్రదేశాల్లో మద్యంపై నిషేధం(Alcohol Ban) విధిస్తూ మధ్య ప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ నిర్ణయం కూడా అమలు అవుతుందని బీజేపీ(BJP) గవర్నమెంట్ స్పష్టంగా చెప్పింది. వీటిలో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, బాందక్పూర్, మైహర్, సల్కాన్పూర్, లింగ, దితియా, మండలేశ్వర్, మహేశ్వర్, మాండసౌర్, అమర్కంటక్, మాండ్లా, ముల్తాయ్, కుండల్పూర్, చిత్రకూట్, బర్మన్, పన్నా వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి.
Also Read: Jammu Kashmir: రాజౌరీ లో ఆగని మిస్టరీ మరణాలు...వైద్యులకు ఇక నుంచి సెలవులు లేవు
జ్యోతిర్లింగమైన ఉజ్జయినిలో కూడా మద్య నిషేధం ఉంటుందా లేదా అన్నదే ఇప్పుడు ఇటు భక్తులను, అటు ఆధ్యాత్మిక వాదులను వేధిస్తున్న ప్రశ్న. ఎందుకుంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఉజ్జయినిలోని కాలభైరవ ఆలయంలో ఆ దేవ దేవునికి మద్యాన్ని ప్రసాదంగా సమర్పిస్తుంటారు భక్తులు. పంచమకర తాంత్రిక ఆచారాల్లో భాగంగా స్వామి వారికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పస్తారు. ముఖ్యంగా మిగతా నాలుగు ఆచారాలైన మాంసం, మత్స్య, ముద్ర , మైతున అనే వాటిని ప్రస్తుతం పాటించట్లేదు. కానీ మద్యం సమర్పణను మాత్రం అలాగే కొనసాగిస్తున్నారు.
Also Read: Maoist Letter on Encounter: వారంతా సేఫ్.. కాంకేర్ ఎన్కౌంటర్పై మావోయిస్టుల సంచలన లేఖ!
ఎక్కడైనా గుడి బయట పూలు, కొబ్బరికాయలు అమ్మే దుకాణాలు ఉండటం సాధారణ విషయమే. ఉజ్జయినిలో మద్యం అమ్మే దుకాణాలు ఉంటాయి. పూలు, కొబ్బరికాయలతో పాటు మద్యాన్ని కూడా బుట్టలో పెట్టి విక్రయిస్తుంటారు. ఎవరో ప్రైవేటు వ్యక్తులు ఇలా అమ్ముతారనుకుంటే పొరపాటే. ఏకంగా ప్రభుత్వమే కౌంటర్లు ఏర్పాటు చేసి కల్తీ లేని మద్యాన్ని అమ్ముతుంటుంది.
ఆచారం ఆగిపోతుందా...
అయితే తాజాగా సర్కారు మద్యపాన నిషేధం విధిస్తూ చేసిన ప్రకటనల జాబితాలో ఉజ్జయిని కూడా ఉన్నట్లు సమాచారం.మరి ఈ నిషేధం వల్ల ఆ దేవుడికి మద్యాన్ని సమర్పించే ఈ ఆచారం ఆగిపోతుందా అనేది ఇప్పుడు అందరిని వేధిస్తున్న ప్రశ్న. దీని పై మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పష్టతనిచ్చారు. ఎప్పటిలాగే కాలభైరవ స్వామికి మద్యం సమర్పించవచ్చని ముఖ్యమంత్రి చెప్రారు. ప్రసాదాన్ని ఆలయానికి తీసుకెళ్లవచ్చన్నవారు. ఉజ్జయినిలో మద్యం దుకాణాలను మూసివేస్తారు.
కానీ ఆలయ పరిసరాల్లోని మద్యం కౌంటర్లు మాత్రం ఎప్పటిలాగే కొనసాగనున్నాయి. ఈ కౌంటర్లలోనే మద్యం కొనుగోలు చేసి కాలభైరవునికి సమర్పించవచ్చు. గతంలో మద్య నిషేధం అమలు చేసినప్పుడు కూడా కాలభైరవ ఆలయంలో ఈ ఆచారాన్ని కొనసాగించినట్లు ఆలయ పూజారి ఓం ప్రకాష్ చతుర్వేది తెలిపారు. 2016లో సింహస్త పండగ సమయంలో మద్య నిషేధం ఉన్నప్పటికీ దేవుడిని మద్యం నైవేద్యంగా పెట్టినట్లు గుర్తు చేశారు. మద్యాన్ని ప్రసాదంలా కూడా భక్తులకు అందించామని చెప్పుకొచ్చారు.
Also Read: Telangana: రేపటి నుంచి వారి ఖాతాల్లో డబ్బులు.. డిప్యూటీ సీఎం భట్టి అదిరిపోయే శుభవార్త!
Also Read: Bandi Sanjay : "ఇందిరమ్మ’ పేరు పెడితే ఇండ్లు ఇవ్వం..బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్