మోదీ ప్రభుత్వం మంజూరు చేసే ఇండ్లకు ఇందిరమ్మ పేరెట్లా పెడతారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండిసంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మీదట ప్రభుత్వం ఇచ్చే ఇండ్లకు ఇందిరమ్మ ఇండ్లు అని పేరు పెడితే కేంద్రం ఒక ఇల్లు కూడా ఇవ్వబోదని సంచలన కామెంట్స్ చేశారు.
Bandi Sanjay : మోదీ ప్రభుత్వం మంజూరు చేసే ఇండ్లకు ఇందిరమ్మ పేరెట్లా పెడతారని కేంద్రమంత్రి బండిసంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మీదట ప్రభుత్వం ఇచ్చే ఇండ్లకు ఇందిరమ్మ ఇండ్లు అని పేరు పెడితే కేంద్రం ఒక ఇళ్లు కూడా ఇవ్వబోదని హాట్ కామెంట్స్ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పేరు పెడితేనే నిధులిస్తామని బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం కొత్తగా జారీ చేయబోతున్న రేషన్కార్డులపై ముఖ్యమంత్రితో పాటు ప్రధాని నరేంద్రమోడీ ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఉచితంగా బియ్యం ఇస్తుంటే పీఎం ఫోటో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.రేషన్ కార్డుపై ప్రధాని ఫోటో పెట్టకపోతే... రాష్ట్రానికి ఉచిత బియ్యం ఎందుకివ్వాలి? కేంద్రం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం క్రెడిట్ కొట్టేస్తోందని విమర్శించారు. ప్రధాని ఫోటో పెట్టని పక్షంలో నేరుగా పేదలందరికీ కేంద్రమే ఉచితంగా బియ్యం, ఇండ్లు ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తాం...అని కీలక వ్యాఖ్యలు చేశారు.
రేవంత్కు గురువు కేసీఆరేనని బండి సంజయ్ అన్నారు. ‘రేవంత్కు కేసీఆరే గురువు. కేసీఆర్ ఏం చేశారో.. రేవంత్ అదే చేస్తున్నారు. అవినీతి కేసుల్లో కేసీఆర్, కేటీఆర్లను ప్రభుత్వం రక్షిస్తుందని ఆరోపించారు. రేవంత్ పనిలో కొత్తదనం ఏమీ లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? కాళేశ్వరం అవినీతి ఎక్కడకు పోయింది? కేసీఆర్ను జైల్లో ఎందుకు వేయడం లేదు? రేపే అరెస్ట్ అని ఇంకా ఎన్ని రోజులు అంటారు? ఫార్ములా కారు రేసు కేసులో కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? గ్రీన్ కో కంపెనీ నుంచి కాంగ్రెస్కు డబ్బులు ముట్టాయ్. దావోస్కు రెండుసార్లు పోయినా.. పెట్టుబడులపై స్పష్టత లేదు. దావోస్ పెట్టుబడులపై శ్వేత పత్రం విడుదల చేయాలి’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ మేయర్ సునీల్రావుతోపాటు పలువురు కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఇక మీదట కరీంనగర్ బీజేపీదేనని బండిసంజయ్ స్పష్టం చేశారు.
Bandi Sanjay : "ఇందిరమ్మ’ పేరు పెడితే ఇండ్లు ఇవ్వం..బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
మోదీ ప్రభుత్వం మంజూరు చేసే ఇండ్లకు ఇందిరమ్మ పేరెట్లా పెడతారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండిసంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మీదట ప్రభుత్వం ఇచ్చే ఇండ్లకు ఇందిరమ్మ ఇండ్లు అని పేరు పెడితే కేంద్రం ఒక ఇల్లు కూడా ఇవ్వబోదని సంచలన కామెంట్స్ చేశారు.
Bandi Sanjay Sensational Comments
Bandi Sanjay : మోదీ ప్రభుత్వం మంజూరు చేసే ఇండ్లకు ఇందిరమ్మ పేరెట్లా పెడతారని కేంద్రమంత్రి బండిసంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మీదట ప్రభుత్వం ఇచ్చే ఇండ్లకు ఇందిరమ్మ ఇండ్లు అని పేరు పెడితే కేంద్రం ఒక ఇళ్లు కూడా ఇవ్వబోదని హాట్ కామెంట్స్ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పేరు పెడితేనే నిధులిస్తామని బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం కొత్తగా జారీ చేయబోతున్న రేషన్కార్డులపై ముఖ్యమంత్రితో పాటు ప్రధాని నరేంద్రమోడీ ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఉచితంగా బియ్యం ఇస్తుంటే పీఎం ఫోటో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.రేషన్ కార్డుపై ప్రధాని ఫోటో పెట్టకపోతే... రాష్ట్రానికి ఉచిత బియ్యం ఎందుకివ్వాలి? కేంద్రం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం క్రెడిట్ కొట్టేస్తోందని విమర్శించారు. ప్రధాని ఫోటో పెట్టని పక్షంలో నేరుగా పేదలందరికీ కేంద్రమే ఉచితంగా బియ్యం, ఇండ్లు ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తాం...అని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: TG News: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఇప్పట్లో లేనట్లే!
రేవంత్కు గురువు కేసీఆరేనని బండి సంజయ్ అన్నారు. ‘రేవంత్కు కేసీఆరే గురువు. కేసీఆర్ ఏం చేశారో.. రేవంత్ అదే చేస్తున్నారు. అవినీతి కేసుల్లో కేసీఆర్, కేటీఆర్లను ప్రభుత్వం రక్షిస్తుందని ఆరోపించారు. రేవంత్ పనిలో కొత్తదనం ఏమీ లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? కాళేశ్వరం అవినీతి ఎక్కడకు పోయింది? కేసీఆర్ను జైల్లో ఎందుకు వేయడం లేదు? రేపే అరెస్ట్ అని ఇంకా ఎన్ని రోజులు అంటారు? ఫార్ములా కారు రేసు కేసులో కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? గ్రీన్ కో కంపెనీ నుంచి కాంగ్రెస్కు డబ్బులు ముట్టాయ్. దావోస్కు రెండుసార్లు పోయినా.. పెట్టుబడులపై స్పష్టత లేదు. దావోస్ పెట్టుబడులపై శ్వేత పత్రం విడుదల చేయాలి’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ మేయర్ సునీల్రావుతోపాటు పలువురు కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఇక మీదట కరీంనగర్ బీజేపీదేనని బండిసంజయ్ స్పష్టం చేశారు.