Liquor Scam: తమిళనాడులో లిక్కర్ స్కాం ప్రకంపనలు.. భారీగా వసూళ్లు

ఢిల్లీ తరహాలోనే తమిళనాడులో లిక్కర్ స్కాం జరిగినట్లు ఈడీ ఆరోపించింది. ఇక్కడ రూ.వెయ్యి కోట్లు గుర్తు తెలియని వ్యక్తులకు చేరినట్లుగా ఈడీ గుర్తించింది. ఈ మేరకు తమిళనాడులో మద్యం సరఫరాదారులు, దుకాణాదారులు, ఇతరుల ఇళ్లు,కార్యాలయాల్లో సోదాలు చే'సింది.

New Update
 Liquor scam in Tamil Nadu

Liquor scam in Tamil Nadu

ఢిల్లీ తరహాలోనే తమిళనాడులో లిక్కర్ స్కాం జరిగినట్లు ఈడీ ఆరోపించింది. ఇక్కడ రూ.వెయ్యి కోట్లు గుర్తు తెలియని వ్యక్తులకు చేరినట్లుగా ఈడీ గుర్తించింది. ఈ మేరకు తమిళనాడులో మద్యం సరఫరాదారులు, దుకాణాదారులు, ఇతరుల ఇళ్లు,కార్యాలయాల్లో సోదాలు చేస్తోంది. మద్యం తయారీ కంపెనీలు రవాణా విషయంలో అత్యధిక ఇన్వాయిస్‌లు తయారు చేసి.. అందులో అధికంగా వేసిన మొత్తాలను రాజకీయ నేతలకు లంచాలుగా ఇచ్చినట్ల ఈడీ భావిస్తోంది. అయితే ఆ డబ్బులు ఏ రాజకీయ పార్టీకి చేరాయన్నది త్వరలోనే భయటపెడుతామని ఈడీ అధికారులు స్పష్టం చేశారు.

Also Read :  రేషన్ కార్డు ఉన్న వారికి అదిరిపోయే శుభవార్త.. ఒకేసారి 3 నెలల రేషన్!

Liquor Scam Shakes Tamil Nadu

తమిళనాడు స్టేట్‌ మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టాస్మాక్‌)లో  రూ.1,000 కోట్లకు పైగా అవినీతి చోటుచేసుకుందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారికంగా ప్రకటించింది.  కాగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన  టాస్మాక్ రాష్ర్టంలోని 4,830 దుకాణాలకు మద్యం సరఫరా చేస్తుంది.  ఈ దుకాణాల ద్వారా ప్రతిరోజూ దాదాపుగా రూ. 150 కోట్ల విలువ చేసే మద్యం అమ్మకాలు జరుగుతాయి. కాగా ఈ కుంభకోణంలో విచారణ ప్రారంభించిన ఈడీ  ప్రయివేట్ డిస్టిలరీలు, మధ్యవర్తులు, ఎక్సైజ్ శాఖ మంత్రి వి. సెంథిల్ బాలాజీతో సంబంధం  ఉన్నట్లుగా భావిస్తున్న కొంతమంది వ్యక్తులపై  దృష్టి సారించింది. అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఈడీ అధికారులు టాస్మాక్ ప్రధాన కార్యాలయం, గోదాములు, ప్రయివేట్ డిస్టిలరీలు,పలువురు అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. 

Also read :  Indian Idol : ఇండియన్ ఐడల్ సీజన్-12 విజేత పవన్‎దీప్ రాజన్ కు ఘోరప్రమాదం...పరిస్థితి విషమం

కాగా డిస్టిలరీసులు తప్పుడు ఇన్వాయిస్‌లను సృష్టించి రవాణా చార్జీలు, సరఫరా ఖర్చులను అధికం చేసి చూపించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఉదాహరణకు లక్ష విలువైన లావాదేవీని లక్షన్నరగా నమోదు చేసి..మిగిలిన యాభై వేలు లంచాలుగా నగదు రూపంలో పంపీణీ చేసినట్లు  ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ కుంభకోణంలో మద్యం కొనుగోలు చేసే బార్లు కీలక పాత్ర పోషించినట్లు ఈడీ అనుమానిస్తోంది. అయితే రాష్ర్టంలోని మద్యం దుకాణాలు, బార్లు ప్రధానంగా అధికార పార్టీ నేతలకు చెందినవేనని తెలుస్తోంది. దీంతో ఈ కుంభకోణం అధికార పార్టీ డీఎంకేకు చుట్టుకునేలా ఉందని భావిస్తున్నారు. కాగా గడచిన మూడు రోజులుగా కీలకమైన ప్రాంతాల్లో  చేసిన తనిఖీల్లో పలు కీలక పత్రాలు, భారీగా నగదు లభ్యమైనట్లుగా చెబుతున్నారు. అధికారంగా చూపించిన మొత్తంలో టాస్మాక్ అధికారులకు కొంత చేరగా ఎక్కువ మొత్తం  రాజకీయ నేతలకు చేరిందని ఈడీ భావిస్తోంది.

Also Read :  కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్.. 20 మంది మావోయిస్టులు హతం..!

కాగా ఢిల్లీలాగే తమిళనాడులో లిక్కర్ స్కామ్ జరిగిందని బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. ఇటీవల ఈడీ అధికారులు దర్యాప్తు చేయడంతో లావాదేవీలు బయటపడ్డాయని స్పష్టం చేసింది. ఏకంగా రూ. వెయ్యి కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది,  ఈ లిక్కర్ స్కామ్ బయటపడుతుందనే భయపడి.. హిందీ భాష, డీలిమిటేషన్ వివాదాలను అధికార డీఎంకే తెరపైకి తీసుకువచ్చిందని కమలం పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే బీజేపీ చేస్తున్న ఆరోపణలను డీఎంకే కొట్టిపారేసింది.


  Also Read: అణు బెదిరింపులకు లొంగేది లేదు.. తేల్చి చెప్పిన రాజ్‌నాథ్ సింగ్


అయితే టాస్మాక్‌లో భారీగా అవకతవకలు జరిగాయని బీజేపీ, అన్నాడీఎంకే చేస్తున్న ఆరోపణలను తమిళనాడు ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ ఖండించారు. టాస్మాక్‌లో అవినీతి జరిగేందుకు ఎలాంటి ఆస్కారం లేదని తేల్చి చెప్పారు. సోదాల పేరుతో ఈడీ దాడులు చేసిందని.. కానీ ఏ ఏడాదిలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో పేర్కొనలేదని తెలపలేదన్నారు. గత 4 ఏళ్లుగా బార్ల టెండర్లను ఆన్‌లైన్‌లోనే ప్రాసెస్ చేస్తున్నామని.. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.1000 కోట్ల స్కామ్ జరిగిందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి సెంథిల్ బాలాజీ మండిపడ్డారు.

Also Read: అబ్బాయిలంటే అలెర్జీ.. పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు.. వైరల్ వీడియో!

 

CM MK Stalin | dmk | dmk-party | tamilanadu | tamilandu | liquor-scam-case | liquor-scam

Advertisment
Advertisment
తాజా కథనాలు