/rtv/media/media_files/2025/05/08/DEEQs0vYBXximlCr9MQq.jpg)
India govt Bans Pakistani Content on OTT Platforms Amid Terror Concerns
Pakistani Content Ban: పాక్తో నెలకొన్న ఉద్రిక్తతల తరుణంలో OTT ప్లాట్ఫామ్స్కు(OTT Platforms) భారత ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. పాకిస్థాన్లో రూపొందిన వెబ్ సిరీస్లు(Web Series), సినిమాలు(Movies), సంగీతం(Songs), పాడ్కాస్ట్లు(Podcasts), ఇతర మీడియా కంటెంట్ను వెంటనే తొలగించాలని భారత ప్రభుత్వం అన్ని OTT ప్లాట్ఫారమ్లు, డిజిటల్ స్ట్రీమింగ్ సేవలను ఆదేశించింది. జాతీయ భద్రతా ఆందోళనలు పెరిగిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసింది. గురువారం ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది.
In the interest of national security, all OTT platforms, media streaming platforms and intermediaries operating in India are advised to discontinue the web-series, films, songs, podcasts and other streaming media content, whether made available on a subscription based model or… pic.twitter.com/8yjP6ULNEU
— ANI (@ANI) May 8, 2025
Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్పై ఖర్గే సంచలన కామెంట్స్!
జారీ చేసిన ప్రకటన ప్రకారం..
జాతీయ భద్రత దృష్ట్యా భారతదేశంలో పనిచేస్తున్న అన్ని OTT ప్లాట్ఫారమ్లు, మీడియా స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లు, మధ్యవర్తులు వెబ్-సిరీస్, సినిమాలు, పాటలు, పాడ్కాస్ట్లు, ఇతర స్ట్రీమింగ్ మీడియా పాక్లో రూపొందిన కంటెంట్ను నిలిపివేయాలని ప్రకటనలో పేర్కొంది. ఇది సబ్స్క్రిప్షన్ ఆధారిత, ఉచిత యాక్సెస్ ప్లాట్ఫారమ్లు రెండింటికీ వర్తిస్తుంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ ఆదేశం జారీ అయింది.
Also Read: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్
Also Read: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!
operation Sindoor | latest-telugu-news | telugu-news | ott platform