Hydra Police Station: హైడ్రా పోలీస్ స్టేషన్ షురూ.. ఇక తోక జాడిస్తే.. రంగు పడుద్ది..!

హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటైన హైడ్రా పోలీస్ స్టేషన్ అక్రమ నిర్మాణాలు, భూకబ్జాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి మే 9న ఈ హైడ్రా పోలీస్ స్టేషన్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు.

New Update
Hydra Police Station

Hydra Police Station

Hydra Police Station: హైదరాబాద్(Hyderabad) నగరంలో కొత్తగా ఏర్పాటైన హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. అక్రమ నిర్మాణాలు, భూకబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కఠినంగా వ్యవహరించేందుకు ఈ ప్రత్యేక విభాగాన్ని సిద్ధం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మే 9న దీనిని అధికారికంగా ప్రారంభించనున్నారు.

Also Read: 11, 12, 14 ఈ నెంబర్లకు ఆపరేషన్ సిందూర్‌కు ఉన్న లింక్ ఏంటో తెలుసా..?

ప్రత్యేకంగా నియామకాలు, నిపుణుల బృందంతో ఇతర పోలీస్ స్టేషన్లకు అతీతంగా పనిచేసే ఈ ప్రత్యేక శాఖలో ఒక ఏసీపీ, ఆరు ఇన్‌స్పెక్టర్లు, పన్నెండు ఎస్‌ఐలు, ముప్పై మంది కానిస్టేబుళ్లను నియమించారు. ఇందులో వనరుల వినియోగాన్ని మరింత పెంచేందుకు సుమారు 70కి పైగా వాహనాలు, అందులో 40 స్కార్పియోలు, 20 డీసీఎంలు, బైక్స్, టిప్పర్లు తదితర రకాల వాహనాలను హైడ్రా తన సేవలోకి తీసుకుంది. ఈ వాహనాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా స్టేషన్‌కు అప్పగించనున్నారు.

Also Read:  Operation Sindoor : పాక్‌పై దాడుల వేళ...నేడు CCS తో ప్రధాని మోదీ కీలక భేటీ

ఉద్యోగాన్ని కోల్పోయిన వారికి అవకాశం..

DRFలో 150 మందికి స్థానం.. ఇంతకు ముందు పోలీస్ ఉద్యోగాలకు స్వల్పంగా తక్కువ మార్కులతో అర్హత కోల్పోయిన 150 మందిని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) ద్వారా హైడ్రాలోకి తీసుకున్నారు. వీరికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి, హైడ్రా కార్యకలాపాల్లో భాగం చేయనున్నారు.

ఆక్రమణలపై గట్టి చర్యలు..

భూములను అక్రమంగా కబ్జా చేసే వారిపై కఠిన చర్యలు ఉండనున్నాయి. చెరువుల్లో మట్టిపోసి భూమిని ఆక్రమించడం, నాలాలు మూసేయడం, తప్పుడు పత్రాలతో ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవడం, రోడ్లపై నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు వంటి చర్యలపై నేరుగా కూల్చివేతలు చేపడతామని స్పష్టం చేశారు.

Also Read: యావత్ దేశానికే గర్వకారణం.. ఆపరేషన్ సిందూర్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్!

ప్రజల్లో భయం.. 

ఇప్పటికే హైడ్రా చర్యలు సామాన్య ప్రజల్లో కూడా భయాన్ని రేపుతున్నాయి. "బిగ్ షాట్స్ పై చర్యలు తీసుకుంటే వారు కోర్టుకెళ్తారు, కానీ సామాన్యులు ఏమి చేయలేరు" అనే భావన ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. కనీస సమాచారం లేకుండా కూల్చివేతలు జరగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంపై హైడ్రా ప్రభావం వల్ల ధరలు పడిపోతున్నాయన్న వాదనలు కూడా ఉన్నాయి.

ఇప్పుడు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో, ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, ప్రజలకు న్యాయం అందిస్తుందో లేక పేద ప్రేజల్లో భయాన్నే మిగులుస్తుందో అన్నది సమయం చెప్పాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు