/rtv/media/media_files/2025/02/08/m7EInB6vVMPOz0yx9ma6.jpg)
CM's Who defeated By BJP
2024, 25 అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections 2025) సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ లు. ఒక్కో చోట ఒక్కో నేతకు పడిన దెబ్బలు మామూలువి కావు. 2024 ఎన్నికల్లో ఓవరాల్ గా బీజేపీ గెలిచింది కానీ కొన్నిరాష్ట్రాల్లో కాంగ్రెస్, ఇతర పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అయితే అన్ని మేజర్ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను దెబ్బ తీసింది మాత్రం బీజేపీ అనే చెప్పాలి. ముఖ్యంగా ముగ్గురు ముఖ్యమంత్రుల పీఠాలను కూకటివేళ్ళతో సహా పెకిలించి పారేసింది.
Also Read : పుల్లారావు..నువ్వెక్కడ దాక్కున్నా లాక్కొస్తా...టీడీపీ లీడర్కు విడదల రజనీ మాస్ వార్నింగ్
బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన కేసీఆర్..
ఈసారి ఎన్నికల్లో తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్, బీజేపీలను చాలా గట్టి దెబ్బే కొట్టింది. దాదాపు అన్ని జిల్లాలలో విజయ ఢంకా మోగించింది. అయితే కేసీఆర్ (KCR) ఇలాకాలో మాత్రం బీజేపీ గెలిచింది. బీఆర్ఎస్ లో మిగతా అందరు బడా నాయకులూ కాంగ్రెస్ చేతిలో ఓడిపోతే...ఒక్క కేసీఆర్, పార్టీ పెద్ద మాత్రం బీజేపీ నేత చేతిలో ఓడిపోయారు. కేసీఆర్ పోటీ చేసిన కామారెడ్డిలో ప్రజలు ఎన్నికల్లో సంచలన తీర్పు ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి 5,156 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రెండో స్థానంలో కేసీఆర్ నిలవగా.. అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు. కేసీఆర్ ను ఓడించిన బీజేపీ నేతగా రికార్డుకెక్కాడు.
Also Read : పుష్ప రాజ్ సక్సెస్ మీట్ .. మీడియా ముందుకు అల్లు అర్జున్!
మమతా బెనర్జీ..
బెంగాల్ ముఖ్యమంత్రి, దీదీ...మమతా బెనర్జీ..ఈమె గురించి తెలియనది ఎవరికి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో ఓవరాల్ గా తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది. ఈసారి అధికారం కూడా ఆ పార్టీనే దక్కించుకుంది. మళ్ళీ దీదీనే ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఎన్నికల్లో మాత్రం మమతా బెనర్జీ ఓడిపోయారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సంచలన ట్విస్ట్ వచ్చింది. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది కూడా. వెస్ట్ బెంగాల్ లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన సీఎం మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి 1,736 ఓట్ల మెజారిటీతో మమతపై విజయం సాధించారు. మొదట నందిగ్రామ్లో మమతా బెనర్జీ (Mamata Banerjee) గెలిచారని వార్తలు వచ్చాయి. 1200 ఓట్లతో ఆమె విజయం సాధించారని ప్రచారం జరిగింది.. కానీ అంతలోనే అక్కడ ఊహించని మలుపు ఏర్పడింది. మమత గెలవలేదని.. సువేందు అధికారి విజయం సాధించారని ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీనిని తరువాత మమతా బెనర్జీ కూడా ఒప్పుకున్నారు. నందిగ్రామ్లో ప్రజల తీర్పును శిరసావహిస్తానని చెప్పారు మమత బెనర్జీ. అతి పెద్ద పోరాటం కోసం కొన్ని త్యాగాలు చేయకతప్పదని ఓటమి అంగీకరించారు.
Also Read : బ్రేకప్ బాధేంటో నాకు తెలుసు.. సమంతతో విడాకులపై కన్నీరు పెట్టించే చైతూ వీడియో!
కేజ్రీవాల్...
కేసీఆర్, మమతా బెనర్జీ తరువాత ఇప్పుడు కేజ్రీవాల్ (Kejriwal) వంతు. న్యూఢిల్లీ అసెంబ్లీ(New Delhi Assembly) స్థానం నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ(Parvesh Verma) చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ప్రస్తుతం పర్వేష్ వర్మ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నారు. దీంతో ఎవరీ పర్వేశ్ వర్మ అని ఇప్పుడు దేశమంతటా హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ఈయన పార్లమెంటు అంచనాల కమిటీ, ఆర్థిక కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. న్యూ ఢిల్లీలో ఆప్ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్ను ఓడించి హాట్ టాపిక్ గా మారిన పర్వేశ్ వర్మకు సీఎం సీటు దక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. లిక్కర్ స్కామ్, కొన్ని నెలల పాటూ జైల్లో గడపడం లాంటి కారణాల వల్లనే కేజ్రీవాల్ ఓడిపోయారని చెబుతున్నారు.
Also Read: Delhi Results: 27 ఏళ్ల నిరీక్షణ.. ఢిల్లీలో బీజేపీ గెలవడానికి 8 ప్రధాన కారణాలివే!