Dhruv Rathee: ఆప్‌ ఓటమిపై స్పందించిన ధ్రువ్‌ రాఠీ.. బీజేపీపై విమర్శలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఓటమిపై ప్రముఖ యూట్యూబర్‌ ధ్రవ్‌ రాఠీ స్పందించారు. ప్రభుత్వ పాలన జరగకుండా బీజేపీ అడ్డుకోవడం వల్లే ఆప్‌ విఫలమైందని ఎక్స్‌ వేదికగా రాసుకొచ్చారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

author-image
By B Aravind
New Update
Dhruv Rathee Responds on AAP Loss in Delhi Assembly Elections

Dhruv Rathee Responds on AAP Loss in Delhi Assembly Elections

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections 2025) ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి బిగ్‌ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. 27 ఏళ్ల తర్వాత బీజేపీ విజయం సాధించింది. 48 స్థానాల్లో బీజేపీ గెలవగా.. ఆప్ కేవలం 22 స్థానాలకే పరిమితమైపోయింది. కాంగ్రెస్ పార్టీ అసలు ఖాతానే తెరవలేదు. ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, సీనియర్ నేత సత్యేంద్ర జైన్ లాంటి నేతలు కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోవడం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఆప్‌పై సైటైరికల్ మీమ్స్, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ప్రముఖ యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీని కూడా టార్గెట్ చేస్తూ అతనిపై ట్రోల్స్ చేశారు. అయితే చివరికి ఆప్‌ ఓటమిపై ధ్రవ్‌ రాఠీ స్పందించారు. ప్రభుత్వ పాలన జరగకుండా బీజేపీ అడ్డుకోవడం వల్లే ఆప్‌ విఫలమైందని ఎక్స్‌ వేదికగా రాసుకొచ్చారు. 

Also Read :  ఆమె క్రిమినల్ లేడీ.. ఇదంతా వారిపనే: ఆధారాలతో జనసేన నేత కిరణ్ రాయల్‌!

Arvind Kejriwal - Dhruv Rathee

'' గత కొన్నేళ్లుగా ఢిల్లీలో ఎలాంటి పనులు జరగకపోవడం వల్లే ఆప్ ఓడిపోయింది. ఎందుకంటే ప్రభుత్వ పాలనను అడ్డుకునేందుకు బీజేపీ చేయదగిందంతా చేసింది. ప్రభుత్వ పాలన ఆదేశాలను లెఫ్టినెంట్ గవర్నర్‌ ద్వారా ఆపడం నుంచి.. కొత్త చట్టాలు ఆమోదించేందుకు ఫేక్ కేసులపై వాళ్ల ఏజెన్సీల ద్వారా పార్టీ నేతలను జైల్లో పెట్టేవరకు చేయలగలిగింది చేసింది. GNCTD యాక్ట్‌ 2023 ఉన్నప్పటికీ కూడా.. ఢిల్లీని ఇప్పటికే బీజేపీ పరోక్షంగా పాలిస్తోంది. 

Also Read :  మోదీది చిత్తశుద్ధి పరిపాలన.. ఢిల్లీతో మరోమారు రుజువైంది: పవన్ కీలక వ్యాఖ్యలు!

ఢిల్లీ ప్రజలు తమ సమస్యలకు ఎవరు బాధ్యులో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తారు. అయితే ప్రజలు రాబోయే రోజుల్లో గాలి కాలుష్యం, యుమునా నది కాలుష్యం, నాసీరకమైన మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత వంటి అంశాలపై మాట్లాడుతారా ?..  లేదా ఇతర రాష్ట్రాల్లో చేసినట్లుగానే మతపరమైన ద్వేషం పేరుతో ఈ సమస్యలన్నీ పట్టించుకోకుండా చేసేలా ప్రజలను బ్రెయిన్‌వాష్ చేయడం, అణిచివేయడం లాంటివి చేయడంలో బీజేపీ సక్సెస్‌ అవుతుందా ? అనేది ఇక్కడ ప్రశ్న'' అని ధ్రువ్‌ రాఠీ ఎక్స్‌లో రాసుకొచ్చారు.  

Also Read :  తీర్పును గౌరవిస్తాం...పోరాటం కొనసాగిస్తాం..రాహుల్ గాంధీ

Also Read :  లోకల్ బాడీ ఎన్నికలే టార్గెట్ గా ..

Advertisment
Advertisment
తాజా కథనాలు