ఢిల్లీ ఎన్నికలతో మోదీపై విశ్వాసం మరోసారి రుజువైందని పవన్ కల్యాణ్ అన్నారు. మోదీ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారని కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇస్తున్నారని పొగిడారు. బీజేపీ నాయకులకు అభినందనలు తెలిపారు.
Pawan kalyan: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో ప్రధానమంత్రి మోదీపై విశ్వాసం మరోసారి రుజువైందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా పాలన సాగిస్తున్నారని కొనియాడారు. మోదీ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారని, ఆయన నిర్దేశించిన లక్ష్యం అందుకోవడంలో ఢిల్లీ పాత్ర అత్యంత కీలకమన్నారు. సంక్షేమాన్ని విస్మరించని అభివృద్ధి కార్యక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇస్తున్నారని పొగిడారు.
స్వాగతించదగ్గ పరిణామం..
ఈ మేరకు ఢిల్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో సమ్మిళిత అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. అమిత్ షా రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలనిచ్చాయి. ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం స్వాగతించదగ్గ పరిణామం. డబుల్ ఇంజన్ సర్కార్ లో సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమం క్షేత్ర స్థాయికి చేరతాయి. దేశ రాజధానిలోని ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసం వికసిత సంకల్ప్ పత్రం ద్వారా బీజేపీ ఇచ్చిన హామీలు ప్రజల మెప్పు పొందాయి. మోదీపై ఢిల్లీ ప్రజలు ఉంచిన విశ్వాసానికి ప్రతీక అక్కడి ఘన విజయం. ఆర్థిక అవకతవకలకు ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాల అమలు, పరిపాలన సాగుతాయని అక్కడి ప్రజలు విశ్వసించారని చెప్పారు.
కేంద్ర హోమ్ శాఖామాత్యులు అమిత్ షా దేశ రాజధాని ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకున్నారు. ఆయన రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలను ఇచ్చాయి. కేంద్ర ఆరోగ్య శాఖామాత్యులు, బీజేపీ జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా కూటమిని ముందుకు తీసుకువెళ్లడంలో సఫలీకృతులయ్యారు. ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో విజయానికి మూల కారకులైన మోదీ, అమిత్ షా, జెపి నడ్డాకు బీజేపీ మిత్ర పక్ష నాయకులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
Pawan kalyan: మోదీది చిత్తశుద్ధి పరిపాలన.. ఢిల్లీతో మరోమారు రుజువైంది: పవన్ కీలక వ్యాఖ్యలు!
ఢిల్లీ ఎన్నికలతో మోదీపై విశ్వాసం మరోసారి రుజువైందని పవన్ కల్యాణ్ అన్నారు. మోదీ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారని కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇస్తున్నారని పొగిడారు. బీజేపీ నాయకులకు అభినందనలు తెలిపారు.
Pawan Kalyan
Pawan kalyan: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో ప్రధానమంత్రి మోదీపై విశ్వాసం మరోసారి రుజువైందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా పాలన సాగిస్తున్నారని కొనియాడారు. మోదీ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారని, ఆయన నిర్దేశించిన లక్ష్యం అందుకోవడంలో ఢిల్లీ పాత్ర అత్యంత కీలకమన్నారు. సంక్షేమాన్ని విస్మరించని అభివృద్ధి కార్యక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇస్తున్నారని పొగిడారు.
స్వాగతించదగ్గ పరిణామం..
ఈ మేరకు ఢిల్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో సమ్మిళిత అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. అమిత్ షా రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలనిచ్చాయి. ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం స్వాగతించదగ్గ పరిణామం. డబుల్ ఇంజన్ సర్కార్ లో సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమం క్షేత్ర స్థాయికి చేరతాయి. దేశ రాజధానిలోని ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసం వికసిత సంకల్ప్ పత్రం ద్వారా బీజేపీ ఇచ్చిన హామీలు ప్రజల మెప్పు పొందాయి. మోదీపై ఢిల్లీ ప్రజలు ఉంచిన విశ్వాసానికి ప్రతీక అక్కడి ఘన విజయం. ఆర్థిక అవకతవకలకు ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాల అమలు, పరిపాలన సాగుతాయని అక్కడి ప్రజలు విశ్వసించారని చెప్పారు.
ఇది కూడా చదవండి: KA Paul: జగన్ను వాళ్లే ముంచేశారు.. చంద్రబాబుకు చచ్చిన తర్వాత నరకం తప్పదు: కేఏపాల్ సంచలనం
కేంద్ర హోమ్ శాఖామాత్యులు అమిత్ షా దేశ రాజధాని ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకున్నారు. ఆయన రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలను ఇచ్చాయి. కేంద్ర ఆరోగ్య శాఖామాత్యులు, బీజేపీ జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా కూటమిని ముందుకు తీసుకువెళ్లడంలో సఫలీకృతులయ్యారు. ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో విజయానికి మూల కారకులైన మోదీ, అమిత్ షా, జెపి నడ్డాకు బీజేపీ మిత్ర పక్ష నాయకులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఇది కూడా చదవండి: AP: ఢిల్లీకి, ఏపీకి పోలిక ఉంది..బీజేపీ చారిత్రాత్మక విజయంపై ఏపీ సీఎం చంద్రబాబు కామెంట్స్