Indian Army: యుద్ధానికి సిద్ధం.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్థాన్‌తో ఏ క్షణమైన యుద్ధం జరగొచ్చనే ప్రచారం నడుస్తోంది. తాజాగా ఇండియన్ ఆర్మీ సంచలన పోస్ట్‌ చేసింది. ఎల్లప్పుడూ సిద్ధమని పేర్కొంటూ జవాన్లు విన్యాసం చేసే దృశ్యాలను షేర్ చేసింది.

New Update
Indian Army

Indian Army

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్థాన్‌తో ఏ క్షణమైన యుద్ధం జరగొచ్చనే ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ ఎక్స్‌లో సంచలన పోస్ట్‌ చేసింది. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం అంటూ పేర్కొంటూ జవాన్లు విన్యాసం చేసే దృశ్యాలను షేర్ చేసింది. '' దేనికీ భయపడం, ఏదీ మమ్మల్ని ఆపలేదు, ఎప్పుడ సిద్ధమే అంటూ తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read: ఐదేళ్ల తర్వాత కైలాస మానస సరోవర్‌ యాత్ర.. కేంద్ర విదేశాంగ మంత్రి కీలక ప్రకటన

Indian Army Prepared War On Pakistan

మరోవైపు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తూర్పు నావికాదళం సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో విశాఖలో నేవీకి సన్‌రైజ్‌ ఫ్లీట్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. తూర్పు నావికాదళాధిపతి వైస్ అడ్మిరల్ పెందార్కర్‌ ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. సముద్రమార్గంలో పెరుగుతున్న ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచనలు చేశారు. 

Also Read: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

అంతేకాదు ప్రస్తుతం అత్యవసర పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో యుద్ధ నౌకలు, సబ్‌ మెరైన్లలో పనిచేస్తున్న సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు సముద్ర తీర ప్రాంతాల్లో భద్రతా బలగాల కదలికలపై  తూర్పు నావికాదళాధిపతి (ENC) స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇక అరేబియా మహాసముద్రంలో భారత నౌకాదళం అత్యాధునిక ఎయిర్‌ క్రాఫ్ట్‌ కారియర్‌ ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ మోహరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

Also Read :  ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

telugu-news | rtv-news | Pahalgam attack | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు