HYD: హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. దీంతో నిర్మాణాలు జోరందుకున్నాయి. ఈ దశలో పెద్ద పెద్ద రియల్టర్ల నిర్మించే బిల్డింగ్లు మొదలు సాధారణ ప్రజలు నిర్మించుకునే ఇండ్లకు ఇసుక తప్పనిసరి. ప్రస్తుతం ఇసుక లభించడం గగనమైంది. అయితే అలా కాకుండా ఇసుకను తక్కువ ధరకు, త్వరగా అందించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. అత్యవసరంగా ఇసుక కొనాలంటే బ్లాక్ మార్కెట్లో ఇసుక ధరలు భారీగా ఉంటున్నాయి. ఇక ప్రైవేటు వ్యాపారులు కూడా టన్నుకు రూ.3 వేలనుంచి 4 వేల వరకు వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్యులకు తలకు మించిన భారమవుతోంది. దీన్ని నివారించేందుకు తెలంగాణ గనుల అభివృద్ధి సంస్థ(టీజీఎండీసీ) నూతనంగా ‘ఇసుక బజార్’లను ఏర్పాటు చేసింది. దీనిద్వారా నిర్మాణదారులు, సామాన్య ప్రజలు నిర్మించుకునే నిర్మాణాలకు తక్కువ ధరకు ఇసుకను అందించేందుకు వీలుగా వీటికి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇసుక కావాలనుకునే వారు ఈ ఇసుక బజార్లకు ఫోన్చేస్తే 48 గంటల్లోనే ఇసుక సరఫరా చేయడానిఇ సిద్ధమైంది.
ఇది కూడా చదవండి: అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళను చంపి.. మృతదేహానికి నిప్పంటించి..!
ఇక ఇసుకను తక్కువ ధరకు అందించడంతో పాటు దళారులకు చెక్ పెట్టేందుకు టీజీఎండీసీ వీలయినన్ని ఇసుక బజార్లను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) చుట్టూ నాలుగు ఇసుక బజార్లను ప్రారంభించింది. వాటిల్లో ప్రస్తుతం 1,78,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఈ బజార్లలో సన్న ఇసుక రూ.1,800 (మెట్రిక్ టన్ను), దొడ్డు ఇసుక రూ.1,600 ( మెట్రిక్ టన్ను) లుగా ధరను నిర్ణయించారు. కాగా ఇసుక బజార్లు అందుబాటులోకి రావడంతో బిల్డర్లు, ప్రజలు కొనుగోలుకు ఆస్తకి చూపుతున్నారు. గతంలో హైదరాబాద్లో ఇసుక ఎక్కువ ధర పలకడంతో పలువురు నిర్మాణదారులు ఇసుకను లారీలల్లో ఇతర జిల్లాల నుంచి తెప్పించుకునేవారు. అయితే కొన్ని ప్రాంతాల ఇసుకకు డిమాండ్ఎక్కువగా ఉండటంతో ఎలాగైన కొంటారనే ఉద్ధేశంతో అక్కడి వ్యాపారులు ధరలు కూడా ఇష్టరీతిన పెంచేవారు. ప్రస్తుతం ఇసుకబజార్లు అందుబాటులోకి రావడంతో ప్రజలకు, బిల్డర్లకు ఇసుక ఖర్చులు తగ్గే వీలు ఏర్పడింది.
Also Read: మోస్ట్ డేంజరస్ వీడియోలు.. గజగజ వణుకు పుట్టాల్సిందే!
ప్రస్తుతం ప్రభుత్వం ఓఆర్ఆర్ వెంట అబ్దుల్లాపూర్మెట్, వట్టినాగులపల్లి, బౌరంపేట, ఆదిబట్లలోఇసుక బజార్లను ప్రారంభించింది. 5 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అబ్దుల్లాపూర్ మెట్ బజార్లో సన్న ఇసుక (13,950 మెట్రిక్ టన్నులు) దొడ్డు ఇసుక (21,662 మెట్రిక్ టన్నులు) , వట్టినాగులపల్లిలో సన్న ఇసుక (19,721 మెట్రిక్ టన్నులు) దొడ్డు ఇసుక (21,000 మెట్రిక్ టన్నులు)లుగా నిర్ణయించారు. ఇక 8.13 ఎకరాల్లో ఏర్పాటు చేసిన బౌరంపేట ఇసుక బజార్లో సన్న ఇసుక (20,736 మెట్రిక్ టన్నులు), దొడ్డు ఇసుక(18,621 మెట్రిక్ టన్నులు) నిలువ ఉంది, 5.13 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఆదిబట్లలో సన్న ఇసుక (30,580 మెట్రిక్ టన్నులు), దొడ్డు ఇసుక (31,958 మెట్రిక్ టన్నులు) నిలువ ఉందని తెలంగాణ గనుల అభివృద్ధి సంస్థ అధికారులు తెలిపారు.
Also Read : DGMO చర్చల్లో భారత్, పాక్ డిమాండ్లు ఇవే
ప్రస్తుతం అందుబాటులో ఉన్న నాలుగు ఇసుక బజార్లకు తోడు త్వరలో శామీర్పేట్, ఘట్కేసర్ ప్రాంతాల్లో మరో రెండు బజార్లను ఏర్పాటు చేయడానికి తెలంగాణ గనుల అభివృద్ధి సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న నాలుగు బజార్లకు నల్లగొండ, కొత్తగూడెం ఇసుక రీచ్ల నుంచి తెలంగాణ గనుల అభివృద్ధి సంస్థ ఇసుకు తీసుకువస్తోంది. ఇక ఇసుక కావలసిన వినియోగదారులు టీజీఎండీసీ వెబ్సైట్ ద్వారా బుక్చేసుకోవలసి ఉంటుంది. ఆయా నిర్మాణాల నుంచి బాజార్లకు ఉన్న దూరాన్ని బట్టి వాహన అద్దె నిర్ణయిస్తారు . బుక్ చేసుకున్న 48 గంటల్లోగా ఇంటికి పంపిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
Also Read : పీవీకి అరుదైన గౌరవం