Jyothi Yarraji: తైవాన్ అథ్లెటిక్స్లో ఏపీ యువతికి గోల్డ్ మెడల్..
తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్-2025లో తెలుగు యువతి జ్యోతి యర్రాజీ గోల్డ్ మెడల్ సాధించారు. 100 మీటర్ల హార్డిల్స్ను ఆమె కేవలం 12.99 సెకన్లలో పూర్తి చేశారు. వైజాగ్కి చెందిన జ్యోతి చివరి రెండు హార్డిల్స్లో వెనుక పడినా అందరినీ దాటుకుంటూ వచ్చి విజేతగా నిలిచారు.