Board of Peace: ట్రంప్ తీసుకొచ్చిన 'బోర్డు ఆఫ్‌ పీస్‌' గురించి తెలుసా ? ఇందులో రూల్స్‌ తెలిస్తే షాకైపోతారు.

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ఇజ్రాయెల్‌-గాజా యుద్ధంలో గాజా తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ప్రాంతాన్ని పునర్‌నిర్మించడం కోసం ఇటీవల ట్రంప్‌  ''బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌''ను ఏర్పాటు చేశారు.

New Update
Trump’s ‘Board of Peace

Trump’s ‘Board of Peace

Board of Peace: ట్రంప్(Donald Trump) రెండోసారి అధికారంలోకి వచ్చాక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ఇజ్రాయెల్‌-గాజా యుద్ధంలో గాజా తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ప్రాంతాన్ని పునర్‌నిర్మించడం కోసం ఇటీవల ట్రంప్‌  ''బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌''ను ఏర్పాటు చేశారు. అయితే ఇది కేవలం గాజా వ్యవహారాని మాత్రమే పరిమితం కాలేదు. అంతర్జాతీయ ఉద్రిక్తతలను పరిష్కరించే దిశగా ఈ బోర్డును విస్తరిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ తాజాగా కీలక ప్రకటన చేశారు. బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌లో శాశ్వత సభ్యత్వం కావాలనుకునే దేశాలు తమకు 1 బిలియన్‌ అమెరికా డాలర్లు చెల్లించాలంటూ ఆదేశించారు. 

Also Read: కృష్ణంరాజు' గారికి 'రెబల్ స్టార్' అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

ఛైర్మన్‌గా ట్రంప్

ఇక వివరాల్లోకి వెళ్తే ''బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌''కు(Board of Peace) ఛైర్మన్‌గా ట్రంప్‌ వ్యవహరిస్తున్నారు. ఇది ఒక అంతర్జాతీయ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం లేదా ముప్పు ఉన్న ప్రాంతాల్లో స్థిరత్వం, నమ్మకమైన, చట్టబద్ధమైన పాలనను పునరుద్ధరించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ సంస్థలో చేరాలని ట్రంప్ యంత్రాంగం దాదాపు 60 దేశాలకు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. అయితే ట్రంప్‌ ఈ బోర్డుకు ఛైర్మన్‌గా వ్యవహరించడమే కాక అమెరికాకు ప్రారంభ ప్రతినిధిగా విడిగా సేవలందిస్తారు. బోర్డు ఆఫ్ పీస్ లక్ష్యాలు నెరవేర్చేందుకు అనుంబంధ సంస్థలను ఏర్పాటు చేయడం, మార్చడం లేదా రద్దు చేసే అధికారం ఛైర్మన్‌కు ఉంటుంది. 

Also Read: బంగ్లాదేశ్ తో పాటూ 38 దేశాలపై అమెరికా ఉక్కు పాదం..వీసాలపై  పరిమితులు

ఈ బోర్డులో చేరిన సభ్యదేశాలకు మూడేళ్ల పాటు పదవీకాలం ఉంటుంది. అయితే ఛైర్మన్‌ వీళ్లను ఎప్పుడైనా తొలగించే అధికారం ఉంటుంది. బోర్డ్ ఆఫ్ పీస్ తరపున ట్రంప్ స్వయంగా తీర్మానాలు చేయడం లేదా ఇతర ఆదేశాలను జారీ చేయవచ్చు. ఇందులో ఛైర్మన్‌ను మార్చడమనేది దాదాపు అసాధ్యమే. కేవలం ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయడం లేదా అనారోగ్యం, ఇతర కారణాల వల్ల బాధ్యతలు నిర్వహించనప్పుడు మాత్రమే ఛైర్మన్ మార్పు ఉంటుంది. 

1 బిలియన్ డాలర్లు చెల్లిస్తే అది వర్తించదు

బోర్డు ఏర్పాటైన మొదటి ఏడాదిలోనే ఏ దేశమైతే 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.8,300 కోట్లు) నగదును విరాళంగా ఇస్తుందో ఆ దేశానికి శాశ్వత సభ్యత్వం లభిస్తుంది. అంటే మూడేళ్ల కాల పరిమతి అనేది వర్తించదు. ఇక ఈ బోర్డులో కీలక నిర్ణయాలు తీసుకునే 'ఎగ్జిక్యూటివ్ బోర్డ్' సభ్యుల పదవీ కాలం మాత్రం రెండేళ్లు ఉంటుంది. అంతేకాదు ఈ బోర్డులో ఏటా ఓటింగ్‌ సమావేశాలు కూడా జరుగుతాయి. ప్రతి సభ్య దేశానికి ఇందులో ఒక ఓటు ఉంటుంది. ఇందులో ఏదైనా నిర్ణయం ఆమోదం పొందాలంటే, సమావేశానికి హాజరై ఓటు వేసిన సభ్య దేశాలలో మెజారిటీ అంటే సగాని కన్నా ఎక్కువ మద్దతు ఉండాలి.

Also Read: మోదీ బయోపిక్ ‘మా వందే’కు బడ్జెట్ ఎంతో తెలుసా..?

ఒకవేళ ఓట్లు సమానంగా వచ్చినప్పుడు.. ఛైర్మన్‌కు తన హోదాలో నిర్ణయాత్మకమైన అదనపు ఓటు వేసే అవకాశం ఉంటుంది. మరో విషయం ఏంటంటే మెజారిటీ సభ్యులు ఒక నిర్ణయాన్ని ఆమోదించినప్పటికీ, అది అమలు కావాలంటే కచ్చితంగా ఛైర్మన్ ఆమోదం ఉండాల్సిందే. అంటే సభ్య దేశాలన్నీ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నా ఛైర్మన్‌కు అది నచ్చకంటే దాన్ని తిరస్కరించే అధికారం ఆయనకు ఉంటుంది.

Also Read: అమెరికానా నో వే అంటున్న విద్యార్థులు..75శాతానికి పడిపోయిన అడ్మిషన్లు

ఈ బోర్డులో అధ్యక్షుడు ట్రంప్‌, అమెరికా(usa) విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ట్రంప్ ప్రత్యేక సంధానకర్త స్టీవ్ విట్‌కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, మాజీ బ్రిటిష్ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్, బిలియనీర్ అమెరికా ఫైనాన్షియర్ మార్క్ రోవాన్, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, జాతీయ భద్రతా మండలిలో ట్రంప్‌కు నమ్మకమైన సహాయకుడు రాబర్ట్ గాబ్రియేల్‌లు సభ్యులుగా ఉన్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. ఈ బోర్డులో చేరాలని ట్రంప్ యంత్రాంగం ఆహ్వానం పలికిన దేశాల్లో రష్యా, భారత్, ఈజిప్ట్, కెనడా, పాకిస్థాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ తదితర దేశాలున్నాయి. కనీసం మూడు దేశాలు ఈ బోర్డు నిబంధనలకు కట్టుబడి ఉంటామని సంతకం చేసిన తర్వాత ఇది అమల్లోకి వస్తుంది. 

Advertisment
తాజా కథనాలు