/rtv/media/media_files/2025/05/19/w5nRUq7djNLL7aCT030m.jpg)
Pakistan
The White House: ఇండియా, పాకిస్థాన్ యుద్దం(India Pakistan War) తానే ఆపానంటూ గొప్పలు చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) భారత్కు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుంటూ షాక్ ఇస్తున్నాడు. ఇటీవల పాకిస్థాన్తో జరిగిన యుద్ధంలో తుర్కియో పాకిస్థాన్ కు మద్ధతు ఇచ్చింది. అలాంటి తుర్కియోకు అమెరికా ఆయుధాలు అమ్మిందనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఏకంగా ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నవారికి వైట్హౌజ్లో కీలక పదవులు కట్టబెట్టి మరోసారి ద్రోహానికి పాల్పడ్డారు.
Also Read : ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ప్రారంభించిన సీఎం.. 2.30 లక్షల రైతులకు పోడుపట్టాలు మంజూరు!
పహల్గాం ఉగ్రదాడికి తామే బాధ్యులమంటూ లష్కరే తోయిబాకు చెందిన అనుబంధ సంస్థ ది రిసిస్టెన్స్ ఫ్రంట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ దాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. ఇస్మాయిల్ రోయర్, షేక్ హాంజా యూసఫ్లకు అందులో చోటు కల్పిస్తూ.. వైట్ హౌస్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇస్మాయిల్ రోయర్.. పాకిస్థాన్కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాలో శిక్షణ పొందినట్లు తెలుస్తోంది. అలాగేషేక్ హాంజా యూసఫ్.. ఉగ్రవాద అనుకూల ప్రసంగాలు చేసి పలువురిని తీవ్రంగా ప్రభావితం చేశాడనే ఆరోపణలున్నాయి.
Also Read : పహల్గాం ఎఫెక్ట్.. ఆసియా కప్ నుంచి భారత్ ఔట్
ఇస్మాయిల్ రోయర్ అసలు పేరు రాండల్ టోడ్ రోయర్ క్రిస్టియన్ అయిన రోయర్ 1992లో అతడు ఇస్లాం మతాన్ని స్వీకరించడడంతో పాటు పేరు కూడా మార్చుకున్నాడు. ఆ తర్వాత 20వ దశకంలో పాకిస్థా్న్కు చేరుకున్నాడు. అక్కడ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాలో శిక్షణ తీసుకున్నాడు. 2008లో ముంబై దాడులతో పాటు కాశ్మీర్లో సైనికులు, భద్రతా దళాలపై దాడులకు కుట్రపన్నాడు. 2003లో అమెరికాపై యుద్దం చేయడానికి కుట్రపన్నినట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు ఉగ్రసంస్థలకు మద్ధతు ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి, అలాగే 2--4లో ఆయుధాలు, పేలుడు పదార్థాల సరఫరా, వినియోగం విషయంలో అతనికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత 207లో విడుదలైన రోయర్ ఇప్పటికీ వర్జినియా జిహాద్ నెట్ వర్క్ లో సభ్యుడిగా ఉన్నారు.
ఇది కూడా చూడండి: KL Rahul: టీ20ల్లో కోహ్లీ రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన KL రాహుల్.. జీటీపై భారీ సెంచరీ!
ఇక షేక్ హంజా యూసుఫ్..ఇస్లామిక్ పండితునిగా పేరుపొందాడు. యూఎస్లో తొలి గుర్తింపు పొందిన ముస్లిం లిబరల్ ఆర్ట్స్కాలేజీ, జైతునా కాలేజీలకు సహా వ్యవస్థాపకుడిగా ఉన్నారు. అలాగే బర్కిలీలోని సెంటర్ ఫర్ ఇస్లామిక్ స్టడీస్కు సలహాదారుడిగా కూడా పని చేశాడు. డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఎంపికైనపుడు విదేశాంగ శాఖలో షేక్ హంజా యూసుఫ్ కీలక పదవి లభించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉండటంతో పాటు.. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 2016లో ఛార్జీ షీట్ నమోదు చేసింది.కాగా వీరి నియామకం పై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఇది కూడా చూడండి: West Indies: వెస్టిండీస్కు కొత్త కెప్టెన్.. 2 ఏళ్ల విరామం తర్వాత సారథిగా జట్టులోకి!
Also Read : మాయలేడి జ్యోతి.. పాక్ డబ్బుతో టూర్లు, లగ్జరీ హోటల్స్లో విలాసం