/rtv/media/media_files/2025/06/19/spicejet-flight-2025-06-19-10-03-24.jpg)
Spicejet Flight
ఈ మధ్య వరుసగా విమానాల్లో సాంకేతిక సమస్యలు రావడం ఆందోళన కలగిస్తోంది. తాజాగా మరో విమానానికి కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న స్పైస్జెట్ విమానంలో ఈ సాంకేతిక సమస్య ఏర్పడింది. ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ఈ సమస్య వచ్చినట్లు పైలట్లు గుర్తించారు. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. అయితే ఈ విమానంలో మొత్తం 80 మంది ప్రయాణికులు ఉన్నారు.
Also Read: అమెరికాలో చదువుకోవాలనుకునే వారికి గుడ్న్యూస్.. మళ్లీ వీసాలు షురూ
Technical Problem In Spicejet
ఇదిలాఉండగా ఇటీవల గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్తున్న ఎయిరిండియా విమానం కూలిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత వరుసగా ఇతర ప్రాంతాల్లో కూడా ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఇటవలే 48 గంటల్లో తొమ్మిది ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీంతో వాటిని వెనక్కి మళ్లించడం, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం లాంటి పరిస్థితులు వచ్చాయి.
Also Read: బీటెక్ చేయాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
బుధవారం కూడా మరో విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది. ఢిల్లీ నుంచి రాయ్పూర్ వచ్చిన ఇండిగో విమానంలో సమస్య తలెత్తింది. విమానం ల్యాండ్ అయినా డోర్ మాత్రం తెరుచుకోలేదు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. విమానంలో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేశ్ బగేల్, పలువురు ప్రముఖులు ఉన్నారు. 40 నిమిషాలపాటు ఆయన విమానంలోనే ఉండాల్సి వచ్చింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని మరణించిన విషయం తెలిసిందే.
Also Read: ఇజ్రాయెల్కు సాయం చేయొద్దు.. అమెరికాకు పుతిన్ వార్నింగ్..
Also Read : జగన్ పర్యటనలో రప్పా.. రప్పా నరుకుతామంటూ ప్లకార్డులు
telugu-news | rtv-news | spicejet | Aircraft Technical issue | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu