పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో మాజీ సీఎం జగన్ పర్యటన జరిగిన సంగతి తెలిసిందే. వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వర్ విగ్రహావిష్కరణకు ఆయన హాజరయ్యారు. అయితే ఈ పర్యటనలో ప్రదర్శించిన ఫ్లకార్డులు వివాదాస్పదంగా మారాయి. రప్పా.. రప్పా నరుకుతామంటూ వైసీపీ కార్యకర్తలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. 2029లో జగన వస్తాడు.. అంతు చూస్తాడంటూ ప్లకార్డులతో వచ్చారు. అయితే ఈ వివాదాస్పద ప్లకార్డులపై పోలీసులు సీరియన్ అయ్యారు.
Also Read: బీటెక్ చేయాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
ఈ ప్లకార్డులు ప్రదర్శించిన రవితేజ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ ప్లకార్డులపై మంత్రులు లోకేష్, అనిత కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పోలీస్ స్టేషన్ ముందు రవితేజ కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు. ఇక్కడే మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. రవితేజ టీడీపీ కార్యకర్త అని అతని తల్లిదండ్రులు చెబుతున్నారు. అతని టీడీపీ సభ్యత్వ నమోదు కార్డును కూడా చూపిస్తున్నారు. స్నేహితులే బలవంతంగా రవితేజను తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.